శ్రీ గణేశాయ నమః
శ్రీ శ్యామలాయై నమః
శ్రీ లలితాయై నమః
శ్రీ వారాహీ దేవ్యై నమః
ఆషాఢ పాఢ్యమి నుండి ఆషాఢ నవమి వరకు వారాహీ నవరాత్రులుగా ప్రసిద్ది
వారాహీ స్వరూపం ఉగ్రదేవత గా ప్రసిద్ధి . ఆ అమ్మ వారిని సాధారణంగా గృహాలలో
పండితుల యొక్క ఆధ్వర్యం లో మాత్రమే పూజించటం ఉత్తమమైన మార్గం .
ఆ తల్లి ని అందరూ ధ్యానించటానికి అనువుగా దూర్వాస మహర్షి అమ్మ వారి లోకాన్ని అమ్మ వారి రూపాన్ని తానూ దర్శించి మనకు దర్శింప చేశారు .
ఆయన చూపిన మార్గంలో మనమూ ధ్యానం చేసి అమ్మ వారి కృపకు పాతృలమవుదాం . ముందుగా అమ్మ వారి లోకాన్ని దర్శిద్దాం
వారాహీ దేవి నివశించే లోకం చుట్టూ ఉన్న ప్రాకారం లేలేత పచ్చగడ్డి కాంతులతో
ప్రకాశించు మరకత మణులతో నిర్మితమై ఉంటుంది.
ఆ ప్రాకారాన్ని ధ్యానించటం ద్వారా స్థిరమైన సంపద శ్రేయస్సు పుష్టి పొందగలం .
ఆ ప్రాకారం లోపల బంగారు తాటి చెట్ల వనం . ఆ వనం పచ్చని కాంతులతో ప్రకాశిస్తుంది . ఆ వనం లో మరకత మణులతో నిర్మితమై రెప రెప లాడుతున్న
జెండాలతో కూడిన నివాస గృహంలో
నూఱు బంగారు స్తంభాలతో కూడిన బంగారు వేదికపై , ఒక బంగారు పీఠం
ఆ పీఠం పై బంగారు రెక్కలతో కూడిన పద్మం . ఆ పద్మం యొక్క నడిమి భాగాన
కరుగుతున్న బంగారపు కాంతులతో మెరిసిపోవు కర్ణిక (పూల పుప్పొడి ఉండే ప్రాంతము )
ఆ కర్ణిక పై బిందు ఆవరణం దాని చుట్టూ త్రికోణం దాని చుట్టూ వర్తులాకార ఆవరణం దాని చుట్టూ వేయి దళాలతో కూడిన పద్మం ఆ పద్మం చుట్టూ రెండు
వృత్తాకార ఆవరణలు
ఆ ప్రదేశంలో నూట పది అక్షరాల సమూహంతో సేవించబడు ఆ కలహంసి యగు
వారాహీ దేవి సంచరిస్తున్నది
ఈ విధంగా అమ్మవారిలోకాన్ని ధ్యానించి ఆ తదుపరి అమ్మ వారి రూపాన్ని దర్శిద్దామిలా
వరాహ ముఖం తో విరాజిల్లుతూ పద్మముల వంటి కనులతో
ఆ పద్మములకు శత్రువైన చంద్రుని శిరము పై అలంకారంగా
చేసుకుని లేత బంగారు కాంతులీను దేహంతో సంధ్యా సమయపు
సూర్యుని ఎఱుపు రంగుతో శోభిల్లు వస్త్రములు ధరియించి
తన చేతులలో హల (నాగలి ) ముసల (రోకలి) శంఖ ,చక్ర, పాశం,
అంకుశం ధరించి ఒక చేతితో అభయ ముద్ర ను మరొక చేతితో
వర ముద్ర ను ప్రదర్శిస్తూ
సంపూర్ణమైన దయతో నిండిన కనులు కలిగి , సమస్త దేవతా స్త్రీల చేత అర్చించబడి
హృదయంపై కుంకుమ కాంతులతో ప్రకాశిస్తూ అతి సుకుమారమైన సన్నని నడుముతో ఆ తల్లి ఒప్పారుతుంటుంది .
ఆ తల్లి మూఢులకు దూరముగా వుంటూ , ఆర్తులకు శుభములు కలిగించు ఆర్తాలి
కోరుకున్న కోరికలు ప్రసాదించు వార్తాలి .
ఆ అమ్మ వారికి నాలుగు దిక్కులలో ఉన్మత్త భైరవి , స్వప్న భైరవి , తిరస్కరిణి దేవి, కిరిపదా అనే నలుగురు ప్రధాన శక్తులు వుంటారు
అలాగే అష్ట భైరవులు , పదిమంది హేతుకులు సంచరిస్తూ వుంటారు .
అలా ఆ తల్లి పరివారాన్ని తలచుకుని అమ్మ వారిని ద్వాదశ నామాలతో స్మరించుకుంటూ
ఈ స్తోత్రం తో ధ్యానం చేసుకుందాం
శ్రీ మాత్రే నమః
పంచమీ
దండనాథా
సంకేతా
సమయేశ్వరి
సమయసంకేతా
వారాహీ
పోత్రిణీ
శివా
వార్తాలి
మహాసేనా
ఆజ్ఞాచక్రేశ్వరి
అరిఘ్ని
శ్రీ మాత్రే నమః
సదనే తత్ర హరిన్మణి-
-సంఘటితే మండపే శతస్తంభే ।
కార్తస్వరమయపీఠే
కనకమయాంబురుహకర్ణికామధ్యే ॥
బిందుత్రికోణవర్తుల-
-షడస్రవృత్తద్వయాన్వితే చక్రే ।
సంచారిణీ దశోత్తర-
శతార్ణమనురాజకమలకలహంసీ ॥
కోలవదనా కుశేశయ-
-నయనా కోకారిమండితశిఖండా ।
సంతప్తకాంచనాభా
సంధ్యారుణచేలసంవృతనితంబా ॥
హలముసలశంఖచక్రా-
-ఽంకుశపాశాభయవరస్ఫురితహస్తా ।
కూలంకషానుకంపా
కుంకుమజంబాలితస్తనాభోగా ॥
ధూర్తానామతిదూరా-
-వార్తాశేషావలగ్నకమనీయా ।
ఆర్తాలీశుభదాత్రీ
వార్తాలీ భవతు వాంఛితార్థాయ ॥
తస్యాః పరితో దేవీః
స్వప్నేశ్యున్మత్తభైరవీముఖ్యాః ।
ప్రణమత జంభిన్యాద్యాః
భైరవవర్గాంశ్చ హేతుకప్రముఖాన్ ॥