Tuesday, December 30, 2008

పాశురం-౧౪,15


భగవత్ సేవ యందు చక్కని ఆసక్తి కలదాన! ఇంటి వెనుక తోట లో, ఎర్ర తామరలు భానును కిరణాల స్పర్శకు వికసిస్తుంటే ఆది చూసిన కలువ బాలలు ముఖం ముడుచుకుంటున్నవి మరి నీవు?

తెల్లని పలు వరుస కలిగి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ తో మెలుగు, లేత పసుపు వర్ణ అంబర ధరులైన వేద విదులు దేవాలయానికి చేరుతున్నారు………దేవ దేవుని సేవకు

మేలుకో ఓ సుకుమారి ! ఓ మాటకారి!

నీవు చేసిన ప్రతిన మరిచావా? నేకు నీవుగా మెల్కొని స్నానాది కార్యక్రమాలకు మమ్ము కొనిపోదునని………..నీవు నిదుర పోతుంటీవా?

తామర ల వంటి కనులు కలవాడు, సుందరమైన బాహువులు కలవాడు, శంఖ, చక్రాలను చేతి యందు ధరించి ఉండే ఆ మాధవుని లీలలను కీర్తిద్దామ్ లేచి రా.



ఓ చిలుక పలుకుల దాన? ఇంకా కునికి పాట్లు ఏల

ఓ పడతులారా! మీ పలుకులతో చిరాకు కలిగించకండి నేను మీ చెంతనే నిలిచాను

తెలివైన దానవే, మాకు ముందే తెలుసు, నీ మాటకారి తనం, నీ చెణుకులు మీరే మాటకారులు,

ఈ వాదనలెందుకు, నేనే మాటకారిని

ఏమిటి ఈ రోజు నే ప్రత్యేకత? ఎందుకు నీవు ఒక్కదానవె వున్నావు? రా త్వరగా మాతో చేరు

కువాలాయపీ:దమ్ అనే మత్త గజాన్ని ఛంపినవాడు, శత్రువుల గర్వమణిచిన వాడు, మాయను లొబరుచుకున్నటువంటి శ్రీకృష్ణుని తేజస్సును కొనియాదదాం మాతో చేరు

Wednesday, December 24, 2008

paasuram10


నామ సంకీర్తన చేయటం ద్వారానే ముక్తి ని ప్రసాదించుటకు దయా సముద్రుడగు

తులసి మాలల్తొ అలంకరించబడిన కిరీటాన్ని ధరించి ఉండే నారాయణుడు సంసిద్దుడైవున్నాడు

అతడే వుకనాదు కుంభకర్ణుని మృత్యు కొరల్లొకి నెట్టివేశాడు

ఓ ప్రియమైన దాన

ఆ కుంభకర్ణుని నిద్ర పందెం లో ఓడించి, గాఢ నిద్ర బహుమతి గా పొందావా తీవ్రమైన మగత నిను

విడకున్నది

మా అందరిలోనూ శిరోరత్నం వంటి దాన

నిదుర మత్తును వదలగొట్టు…….. మేలుకొ…తలుపు తెరు ముసుగు తొలగించు……నోరు తెరచి మాట్లాడు

ఓ అదృష్టవతి!

మాకన్నా ముందుగానే లేచి, వ్రతం కావించి, ఆనంద అనుబూతి పొందుతున్నావా తలుపు తీయవా ? మాతో మాట్లాడవ?

paasuram9


నవ రత్న ఖచితమైన అందాల మేడ లో హంస తూలికా తల్పం మీద , ఆగరు పొగల సువాసన ల నడుమ ఆదమరిచి నిదుర పోతున్న ఓ అత్త కూతురా!

రత్నాలతో తాపడమ్ చేయ బడిన ద్వారాలను తెరుచుకుని బయటకు రా

ఓ అత్తా!

నీవైనను తనను నిదుర లేపు నీ కూతురు మూగ చెవుడు లేక ఏదైన వ్యాధి తో బాధ పడు చున్నదా?

లేక ఎవరైన ద్వారపాలకులు అడ్దాగించుచున్నారా?

మైకం కమ్మి మగతలొ ఉన్నదా?


మహా మాయావి ..... లక్ష్మి వల్లభా................ మాధవా ........... గోవిందా......... దెవలోకాధిపతి........... అంటూ ఆ భగవత్ నామాలను బిగ్గరగా పలుకు అత్తా

ఆ నామ సంకీర్తనామృతం తన చెవిని సోకి మత్తు వదలి, మాయా తలుపులు తెరుచుకుని బయటకు వస్తుంది

Monday, December 22, 2008

పాశురం-8


తూరుపు తెలతెల వారుతుంది. పశువులు గ్రాసం కోసం పచ్చిక బయళ్ళు వైపు గా సాగుతునాయి వ్రతం ఆచరించా లన్న నిశ్చయం తో సాగుతున్న వనితలను, మాతో చేర్చుకుని నీ ముంగిట నిలబడి ఉన్నాము ఓ తీవ్రమైన కోరికలు కలిగిన యువతి, మేలుకో, మాతో చేరు కృష్ణుని గుణ గణాలను కీర్తించటం ద్వారా వ్రతాన్ని ప్రారం భించ టానికి అవసరమైన పరై అనే సాధానాన్ని పొందుదాం. కెశి ని ఖండించటం ద్వారా సంహరించిన వాడు మల్లు లైన, చాణూర, ముష్టికు లను మదిన్చిన వాడు దేవతా సమూహాలకు అధిపతి, దేవ దేవుడు, అగు కృష్ణుని పాదాల వద్దకు చేరి, సేవించటం ప్రారంబిద్దమ్. మన ప్రేమ అభిమానాలు చూసి, గోవిందుడు మనకు అవసరమైన వాటిని సమకూర్చటానికి ఆతృత ప్రదర్శిస్తాడు. సత్వరమే రా, కృష్ణ ప్రేమ కు పాత్రులమవుదాం.

paasuram7


ఓ అమాయకురాల! దిన చర్య లో ఎడబాటు తప్పదని తెలిసి తొలి పోద్దు లో సమూహాల గా చేరిన భరద్వాజ పక్షుల మధుర భాషణలు వినబడటం లేదా పెరుగు చిలకటం లో గోపికల పూలతో అలంకరించబడిన సిగలు గాలికి కదులాడుచు, వెలువరుస్తున్న సువాసనలు నీకు సో కతమ్ లేదా వారి లయ బద్దమైన కదలికలకు, చేతి గాజుల గల గలలు, వారి మెడ లో అలంకరించుకున్న ఆభరణాల సవ్వడులు కలిసి చేస్తున్న గలగల సవ్వడులు మిన్ను మింటు తున్న్నీ చెవిని తాకటమ్ లేదా? శత్రువైన కేశి ని సంహరీంచినవాడు మనను ఉద్దరించటానికి కృష్ణుని రూపంలో అవతరించినవాడ్అయిన ఆ పరమాత్మాను కీర్తిసున్న మధుర ధ్వనులు విన వస్తున్న ఇంకా మేలుకోకుంటీవి తలుపులు తెరు…….ఎన్ని ఆటంకాలు వచ్చినా…….ఆ దివ్య తేజస్సును దర్సిద్దామ్

Friday, December 19, 2008

pasuram5


లీలా మానుష ధారుడైన కృష్ణుని లీలలు అందరినీ ఆనందం లోను ఆశ్చర్యం లోను ముంచుతున్నాయి

భగవత్ తత్వాన్ని అణువణువున నింపుకున్న మధుర కు నాయకుడతడు

నిర్మలమైన యమునా నది ఉత్తుంగ తరంగాలు కృష్ణుని చిహ్నాలు గా నిలిచాయి

గోకులానికి మణి మకూటాయమానమైన వాడు యశోదకు ఆనందం కలిగించటానికి, ఆమె వాత్సల్యమనె పా శానికి తనకు తానుగా కట్టుబడి “దామోదరుని” గా ప్రసిద్దుడైన ఆ పరమాత్మాను ఆశ్రయించి పరిశుద్దుల మవుదాం

ముగ్ద మనోహర కూసుమాలతో అర్చిద్దమ్

చేతులు కైమోడ్చి నమస్కరిదామ్

ఆయన గుణగణాలను కీర్తిద్దాం

మన హృదయాలలో కృష్ణుని నిలుపుకుందాం

ఈ విధం గా చేయటం ద్వారా అగ్ని కీలల కు ప్రత్తి దగ్ధమైన రీతిలో ఇప్పటివరకు మనం చేసిన పాపాలనే కాక, భవిష్యత్ లో మన చర్యల ద్వారా మనకు ప్రాప్తించే పాపాలను కూడా దహించి వెద్దామ్

కనుక వేగిరమే రండు హరి నామ కీర్తన తో తరిద్దాం

Tuesday, December 16, 2008

పాశురం-4


ఓ పర్జన్యా , వరుణుని కి అధినాయకుడా!సాధారణంగా మా పై నీవు చూపించే కృప లో ఎటువంటి లోటు రానీయకుగంభీరం గా కనిపించే సాగర గర్భం లోనికి నీ తీక్షణ కిరణాలను ప్రసరింప చేయినీటిని సంగ్రహించి, వేగం గా , గర్జనలు చేస్తూ ఆకాశం లో చలిస్తు వుంటేనల్లని నీ ఆకారం ఆ శ్రీ మన్నారాయణుని స్పురణ కు తెస్తుంది.ఆజానుభాహువు అయిన కమల గర్భుని కుడి చేతి లోని చక్రపు తేజస్సునుండి వెలువడినచిన్న కాంతి రేఖ మెరుపు గా జగతి ని వెలుగు చిందిస్తుంది.హరి ఎడమ చేతి లోని శంఖం నుండి వెలువడిన మృదువైన శబ్ధమ్ ఉరుము గా మారిలోకాన్ని ఆశ్చర్యంలో ముంచుతుందిఆ శ్రీ రాముని శరమ్ నుండి వెల్లువెత్తిన బాణపు వరద వలేప్రేమ వర్షం ధారలుగా కురుస్తుందిఆ వర్షం లో తడసిన జగతి కొత్త వూ పిరులు పోసుకుంటుందిరండి, మనం కూడా ఆ సంతోషం లో భాగం పంచుకుందాం.

Monday, December 15, 2008

paasuram-2, 3


Pasuram-2,3
పాశురం-2

శ్రద్ద గా వినండి ఈ వ్రత నియమాలు తెలుసుకోండి

సూర్యొదయాని కన్నా ముందే స్నానాదికాలు ముగించాలి

సిగను పూలతో సింగారించటం, కనులను రంగులతో తీర్చి దిద్దటం వంటి బాహ్య సౌందర్యపు ఆసక్తి విడిచి భగవంతుని పాదాలపై దృష్టి నిలపాలి

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదు. పరులను పౌరుష వాక్యాలతో నొప్పించటం, నిందించటం చేయరాదు పండితులకు ధన ధాన్యాదులు ఉదారంగా సమర్పించాలి. ప్రముఖులను, వేద వేత్తలను విలువైన కానుకలతో సత్కరించాలి

మన జీవన విధానం ఉన్నత మార్గం లో ఉండేటట్లూ చూసుకోవాలి

పాల కడలి లో శేష శయనుడై విశ్రాంతి నొందుతున్న ఆ దేవ దేవుం పాదాలను స్మరిస్తు చక్కని కీర్తన లతో అలరిద్దాం ఈ మార్గాల ద్వారా, ధు:ఖ భూయిష్టమైన ఈ మాయా ప్రపంచం లో నివసిస్తున్నప్పటికీ, నాటి బృందావనం లోని కృష్ణుని సహచరులవలే అవధులు లేని ఆనందాన్ని సొంతం చేసుకుందాం అందుకు మీరే సాక్షులు

పాశురం-3

మనం అనునిత్యం జగత్ పరిరక్షకుడైన ఆ పరమాత్మ "త్రివిక్రమ" నామాన్ని స్మరిస్తూ , పవిత్ర మార్గ శిర స్నానాలు ఆచరించినట్లయితే శారీరిక, మానసిక రుగ్మతలు తొలగి, పరంధాముని అపార కరుణకు పాత్రులమవుతాము.

అదే సమయం లో సమస్త భూ మండలమంతయు, సస్య శ్యామలమై అక్షయం గా వృద్ది చెందుతూ ఉంటుంది.

పంట చేలు ధాన్యపు కంకులతో కళ కళ లాడుతూ ఉంటాయి నీటిలో చేపల గంతులతోనూ, తామర పుప్పోడుల మకరందాన్ని ఆస్వాదిస్తూ తుమ్మెదలు చేసే ఝూంకారాలతోనూ కుండ ల నిండు గా క్షీర ధారలు కురిపించే పశు గణాలు తోనూ, విర బూ సిన సుమాలతొను, భూ మాత చిరు నవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఈ భూమి సమస్తం మధువు తోనూ, క్షీరం తోనూ నిండి ఉంటుంది

Saturday, December 13, 2008

Friday, December 12, 2008

సర్వం vaasudevam


సర్వం వాసుదేవం మనకు ఇంత మంది దేవుళ్ళా! చిన్ని బుర్ర లో పెద్ద ప్రశ్న. ఎవరిని ఎలా పూజించాలో ................. ఎవరిని వదిలేస్తే........... ఎవరికి కోపమోస్తుందో అనేక అనుమానాలు వేదం ఘోషిస్తుంది ............ భగవానూడొక్కడే ...... నారాయనుడీతడు నరులరా

మరి మిగిలిన వారంతా మనకు అర్ధం కాని ప్రశ్న

మరి జవాబు....... ఆ గోవిందుడే తెలియ చేశాడు ఒక సంఘటన ద్వారా.

శ్రీకృష్ణుడు బృందావనం లో పెరుగుతున్నపుడు రోజు లేగదూడ లను తోలుకుని యమున తీరాన వున్న అడవికి వెళుతుండేవారు తోటి గోప బాలుర తో కలసి. ఒక రోజు అలానే వెళ్ళి, భోజనసమయానికి అందరు కలసి ఒక చోట చేరి తమ తమ ఆహారాన్నీ తీసుకుంటున్న సమయం లో అఘాసురుడు అనే రాక్షసుడు వారిని సంహరించటానికి పెద్ద సర్పాకారం ధరించి నోటిని పెద్ద కొండ గుహ వలె తెరిచి వారిని మ్రింగి వేస్తుంటాడు. అపుడు కృష్ణుడు అతనిని సంహరించి గోప బాలుర ను రక్షిస్తాడు. ఈ సన్నివేశాన్ని, దేవతలందరు గమనిస్తుంటారు. అందరు సంతోషం తో పూల వాన కురిపిస్తారు, ఆది గమనిస్తున్న బ్రహ్మ ఆ నారాయణుని శక్తి ని పరీక్షించాలని , కృష్ణుడు అఘాసురుని సంహరించే సమయం లో గోప బాలుర ను,లేగదూడ లను అపహరించుకు వెళతాడు.

కృష్ణుడు చూసే సమయానికి ఎవరు కనిపించరు. ఆలోచిస్తే, ఇది బ్రహ్మ పని అని అర్ధం అవుతుంది. ఇప్పుడెలా, అపహరించింది సాక్షాత్ బ్రహ్మ దేవుడు వారి రక్షణ భారం తనది. వారి కోసం తల్లులు, లేగదూడ ల కోసం గోవులు ఎదురు చూస్తుంటాయి. వెంటనే కృష్ణుడు తానే ఆ గోప బాలుర గాను, లేగదూడ ల గాను రూపాంతరం చెందుతాడు. అలా ఒక సంవత్సర కాలం గదుస్తుంది. గోకులం లో ఎవ్వరూ కూడా ఈ విషయాన్ని గుర్తించరు అందరు తమ పిల్లలు సాధారణం గానే ఉన్నట్లు భావిస్తారు కాని కృష్ణ లీలను గుర్తించలెరు. ఈ మాయను చూసిన బ్రహ్మ తన తప్పు తెలుసుకుని, తన దగ్గర వున్న వారందరిని తిరిగి అప్పగిస్తాడు.

దీనిని గమనిస్తే, ఆ వాసు దేవుడే సకల చరా చర జగత్తు మొత్తం నిండి ఉన్నాడని, ఈ సృష్టి ని సక్రమం గ నడిపించటానికి, తానే పంచ భూతాలు గాను, నవ గ్రహాల రూపం లోను, శివ , విష్ణు శక్తి, గణపతి తత్వాలు గాను, ప్రకృతి గాను, సమస్త ప్రాణి కోటి రూపం లోను తనను తాను ఆవిష్కరించుకున్నాడు . ఈ విషయాన్ని అర్ధం చేసుకోగలిగితే సర్వం వాసుదేవమయం.........

అందుకే వేదం చెబుతుంది..................సర్వ దేవతా నమస్కారం కేశవం ప్రతిగఛతి


సర్వం శ్రీకృష్ణార్పణం హరే కృష్ణ