Monday, March 30, 2009

జ్ఞాపకం


గత కాలపు జ్ఞాపకాల దొన్తరలను కదిలిస్తే రాలిపడిన కొన్ని గురుతులు ఇవి ఆది ఒక బాల సన్యాసుల ఆశ్రమం. నాటి గురుకుల విద్యను ఆదర్శంగా చేసుకుని, ఎర్పాటు చేయబడిన
ప్రభుత్వ గురుకులం

తాడికొండ……..గుంటూర్ జిల్లా…..అప్పట్లో ఆది పదో తరగతి రాంకుల ఖిల్లా. వూరి చివర కొండ దిగువున, చెట్ల నడుమ ప్రశాంత సదనమ్. ఇవన్ని ఐదో క్లాసు నుండి పదో తరగతి వరకు సాగిన ప్రస్థానం లో కొన్ని జ్ఞాపకాలు. ఆదమరచి నిదుర పోతున్న వేళ, కర్ణకట్టోరమ్గా ఈల వేస్తూ నిద్రా భంగం చేసిన వ్యాయామ పంతులు అనుచరులు
గ్రౌండులో పరుగులు పెట్టించినా కాలం జ్ఞాపకం


(ఇప్పుడు ఆ పని వంటికి పట్టిన కొవ్వు చేస్తుంది) క్లాస్ టీచర్ హోదాలో మా సైన్స్ పంతులు, మా డార్మెటరీ కి వచ్చి అందరి మొలతాళ్ళు పట్టిచూసిన జ్ఞాపకం, (తడిగా వున్నయో లేవో అని, స్నానం చేసారో లేదో అని పరీక్ష అన్నమాట…..మొలతాళ్ళూ మాత్రమే తడుపుకున్న రోజులు కొన్ని)

తరువాత అల్పాహారం రోజుకో వెరైటీ….. అపటికిన్కా అధికారులు,నాయకులు అంతగా చెడి పోలేదు…….పదార్ధాలు కమ్మగానే ఉండేవి చపాతీ ఉన్న రోజుల్లో, ఇద్దరు ముగ్గురు పిల్లల సహాయం తీసుకునేవాళ్ళు…దానికి చాలా పోటీ ఎందుకంటే…………..చెప్పాలా ఆది కూడా నేను

ఇక అసెంబ్లీ ముగిసి తరగతి గదుల్లోకి అడుగిడితే నల్ల బోర్డు పై తెల్ల అక్షరాలు వ్రాస్తున్న టీచరు తలపై తొంగి చూస్తున్న నల్ల తాచు కొండ ప్రాంతం కదా….మాతో పాటు, మంద్ర గబ్బాలు, గోధుమ వనె త్రాచులు, ఆరడుగుల జెర్రిగొడ్లు………..అదో భయానక జ్ఞాపకం చీర్ఫుల్ అన్న పదానికి అర్ధం తెలుసుకోమని ఆంగ్ల పంతుళమ్మా ఆజ్ఞ పనామా బ్లేడ్ తో పక్కా వాడిని పర్రున చీరటమ్ అంటూ అర్ధం చెప్పిన మరో ఆంగ్ల పంతులు (ఈ సమాధానం ఆ పంతుళమ్మా గారికి చెబితే ఆ పర్యవసానం.?) సమ్ మెట్ట తామరాస్ ఇన్ ది కొలన్ అంటూ ఆ పంతులు గారి చెణకులు అదో జ్ఞాపకం చదువు దేమున్ది మూలన ఉన్న ముసలమ్మ కూడా చదువుతుంది …శ్రద్ద…. శ్రద్ద ముఖ్యమంటూ వక్కాణించే మరొక పంతులు గారు ఇలా నాడు చదువు నేర్పిన గురువుల గురుతులన్ని పేరు పేరునా జ్ఞాపకం (బంగా రెడ్డి గారు, మోహన రావు గారు, ప్రభాకర రావు గారు, హరి బాబు గారు, వెంగయ్య గారు,డేవిడ్ రాజు గారు,
శాస్త్రి గారు, విజయ లక్ష్మి గారు, రాజేశ్వరి గారు, వెంకట రమణీ గారు,శ్యామా సుందరరావు గారు, వెంకటేశ్వర్లు గారు ఇలా
ఎందరో మహానుభావులు, అందరికి పాదాభివందనాలు)

సశేషం………

Wednesday, March 25, 2009

ఉగాది---------దేవుడు


ఉగాది---------దేవుడు
నూతన వత్సరం. విరోధి నామం…….
సాధారణ జనులకు విరోదులెవ్వరూ
ధర్మం తప్పిన ప్రభువులు……
ఇదేమీ ఖర్మమో తెలుగు ప్రజలకు తమ విరోధులను తామే ఎంపిక చెసుకోవాల్సిన అగత్యం విరోధి నామ సంవత్సరం తొలి
కడు ……… కడ్డూరమ్.
ఈ సమయంలో ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకొమ్మంటే ( అత్యాశ కదూ….అయిన ఈ దేవుడి అభయహస్తం మనలకు వరాలు కురిపిస్తుంటే ఆ దేవుడు ధైర్యం చేయగలడా)
సాహసించి వచ్చి కోరుకొమ్మంటే కొన్ని కోరరాని కోరికలు ……
దేవుడా ఇప్పుడు ఉన్న ధూష్టుదే (ఎవరికైనా నొప్పిగా ఉందా……నిజం నొప్పిగానే ఉంటది ..అదే దాని సహజ న్యాయం) మరల వస్తే
అయ్యా లోకాఢ్యక్షా…….
కొత్తగా మిన్గటానికి వారికి గాని, వారి బకాసుర పుత్ర రత్నాలకు గాని భూములు ఏవీ కనిపించకుండుగాక
పిల్ల కాలువలపై సైతం ప్రాజెక్టులు కట్టవలెనన్న కోరిక కలుగకుండు గాక
నగరాల్లో 24 గంటలు నీటికి బదులు బీరు పంపిణీ చేయవలెనన్న తలంపు రాకుండు గాక
అంతా ఉచితం అంటూ అటు విద్యార్ధులు ఇటు ప్రభుత్వం ఫీజులు కట్టక, ఇప్పటికే విలువలూడిన విద్యారంగపు వలువలూడ దీయకున్దురు గాక
ఓట్ల కోసం ముస్లిం నాయకులు మానవత్వం పై దాడి చేస్తున్నా మూగపోయి చోద్యమ్ చూస్తున్న ఈ నాయకులకు తాము మనుషులకు పుట్టామన్న నిజం గుర్తుండు నటుల చేయుగాక.
సత్యమో అసత్యమో తెలియని విధంగా సాఫీగా సాగుతున్న వ్యాపారాలను పుత్రుల కోసం, అల్లుళ్ల కోసం దిగజార్చ కున్దురు గాక
కోరికాల చిట్టా పెరుగుతుందా…… ..ఇక అడగనులే
దేవుడా ఇక హైటెక్కు ఎక్కువైన బాబు గారు వస్తే
చరిత్ర పాఱాలు నేర్పుతుందని, గతానుభవాల ఆధారం గానే వర్తమానం లో భవిష్యత్ రూపొందించుకోవాలన్న జ్ఞానం ప్రాసాదించు.
కలరు టి వి ల కన్నా కనీస సౌకర్యాల కల్పన ముఖ్యమన్న తెలివిడి ప్రసాదించు
పల్లెలు పచ్చగా, పంట చేలు నిండుగా కళ కళ లాడుతున్నపుడే ప్రజలు సంతోషం గా ఉంటారన్న కనువిప్పూ కలిగించు.
సంక్షేమ పధకాల కన్నా స్వయం ఉపాధి కల్పించటం ముఖ్యమని తెలియచెప్పు
ఇక మూడవది……..వద్దులే బాబు………..
ఏ విధంగా హింసిస్తారో, ఏ రూపమ్ లో దొపిడి చేస్తారో తెలియని దొంగల దెబ్బ కన్నా, తెలిసిన దొంగలే బెటరు
(అయిన అధికారం లోకి రాక ముందే తొటి మానవుల అవయవాల మీద తమ అధికార పునాదులు నిర్మించుకోవటానికి సిద్దపడ్డ వారు…………పదవి లోకి వస్తే……………?)
ఓ దేవుడా……………… అన్నిటికన్నా ముందు ………….
ఉచితం గా తినే తిండి కన్నా , కాయ కష్టం తో సంపాదించుకున్న గంజి నీళ్ళు రుచికరము, ఆరోగ్యప్రదము అన్న గ్రహీంపు నాకెల్లపుడు గుర్తుంచుకొనెట్లు చేయి
ప్రభుత్వాలు ఓట్ల కోసం ప్రవేశ పెట్టిన క్షేమాకారం కానీ సంక్షేమ పధకాల ఉచ్చు లో చిక్కుకుని భవిష్యత్ తరాల వారి బ్రతుకు బన్డలు కానివ్వని ఇంగిత జ్ఞానం నాకు ఇవ్వు.
ఈ నా వేడుకోలు ఈ విరోధి నామ సంవత్సరంలో నాకెవ్వరూ విరోధులను ఇవ్వకుండా చూడూము తండ్రి నారాయణా

Tuesday, March 24, 2009

ఓటరు mahaSayaa


ఎన్నికల నగారా మ్రోగింది రాజకీయ జంతువుల వింత విన్యాసాలకు మరోసారి తెర లేచింది
అమ్మ దయ అంటూ , వేల సంవత్సరాలనుండి భారత దేశానికి సర్వం సహా చక్రవర్తులు నివసించే ప్రాంతం ఈ హస్తిన ఏ అన్న నిజాన్ని మనకు మళ్ళి మళ్లీ గుర్తు చేస్తు, ఢిల్లీ గల్లిల్లో నే కాక అంతర్జాతీయ విఫణి లో ఆంధ్రుల పరువును తాకట్టు పెట్టిన నూరు వసాంతాలు నిండిన భస్మాసుర హస్తం (భస్మాసురులు…..……ఆంధ్రులు, హస్తం మాత్రమే కాన్గీయులది)
ఇది సత్యమో …….అసత్యమో
ఆంధ్రులు గొర్రెల మంద అన్న ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించి,మదరాసీలుగా ముద్రపడ్డ జాతికి సొంత గుర్తింపు నిచ్చి, జనులకు రాజకీయ స్పృహనిచ్చి, తరువాత కాలం లో గతి తప్పి పల్లెల ప్రాముఖ్యం విస్మరించి, రైస్ పండించే రైతు కన్న, కామన్ సెన్స్ లోపించిన కంప్యూటర్ మిన్న అనుకున్న కళ తప్పిన సైకిల్
అన్నం బదులు అందరికి కంప్యూటర్ చిప్స్ తినిపిద్దమనుకున్నరేమొ
లక్షం పెద్దది అయినప్పుడు ప్రణాళిక కూడా ఎంతొ ముందుగా సిద్దం చేసుకోవాలి. ఇది ముందుగానే పసి గట్టి వారి రక్తాన్ని వారి కళ్ళను వారికే ఎర వేసి, తెలుగోళ్ళూ వెర్రి వెన్గళాయ్లోయ్ చూపిస్తాం చూడండి అంటూ ముందుకొస్తుంది ఇంకా గుర్తు తెలియని కుటుంబ రాజ్యం
అహా ఆంధ్రులకు మరో బీహార్ కనిపిస్తుంది……….కొంచెం మార్పు…… బావ……..రబ్రీ దేవి. బావ మరిది………..లాలూ ప్రసాద్ యాదవ్
ఇవి కాక రజాకార్ల రాజ్యం మళ్ళి తెస్తామంటు వురకలు వేస్తున్న గులాబీ కారు, కూరలో కరివేపాకు వంటి కామ్రేడ్స్ ఇవన్ని కాక నేతి బీరకాయలో నెయ్యి వెదకిన చండం గా, సమాజంలో లోపించిన నైతిక విలువలను, రాజకీయాలలో వెదకుతూ, ప్రాధమిక పాటశాల అయిన తల్లి ఒడిలోనే మానవతా విలువలు మృగ్యమైన సత్యం విస్మరించి, అదృష్టం కలసి వస్తుందేమో అని ఎదురు చూస్తున్న తోడేళ్ళ గుంపుకు నాయకత్వం వహిస్తున్న అమాయక జీవి ఒక వైపు .
నెల నాళ్ళ వినోదమ్……….పంచ వసాంతాల పాట్లు (ఎవరి అభిప్రాయం వారిది)

Monday, March 23, 2009

evarIme


నేచ్చెలి నుదిటి పై చిరుగాలికి అటునిటు వూగుతున్న నీలి కురులు నాతో వుసులాడ వేగిరమే రమ్మంటున్నవి
శుక్ల పక్షపు నవమి నాటి చంద్రుని బోలు చెలి ఫాల భాగం నులి వెచ్చని పెదవుల స్పర్శ కోరి ఎదురు చూస్తున్నట్లున్నది కలువల వంటి కనులు కోటి భావాలు పలికిస్తూ మనసున మధుర భావనలు రేకెత్తించు చున్నవి
సంపెంగ సువాసనలు వెదజల్లెడు నాశిక నా ఉచ్వాస నిశ్స్వాసలను ద్విగుణికృతం చేస్తున్నది
లేత చిగురుల వంటి చినదాని చెక్కిళ్ళు గులాబీ వర్ణం లో అలరారుతూ హృదయంలో అలజడులు సృష్టిస్తున్నవి.
అలివేణి ఆధారాల పై ఆవిష్కృతమైన చిరు చెమట బిందువులు సూర్య కాంతి సోకి ఆణి ముత్యాల వోలే ఆకర్షించుచున్నవి
అహా! ఎవరీమె
అరుణ కాంతులీనుటూ , మనసులో మల్లెలు పూయిస్తున్న ముద్ద బంతి మోము చూదామని మేలి ముసుగు తొలగించేంతలో
కప్పుకున్న దుప్పటి లాగేస్తూ, ముఖం పై నీళ్ళు చిమ్ముతూ… ఏడు గంటాలయినా ఇంకా నిదుర మత్తు వదలటమ్ లేదా అంటూ…… ఎదురుగా…………………………………………………………………………………………………… …………………………………………………………………………………………………… (పెళ్ళైన వాళ్ళైతే ఒకరు……..పెళ్ళీ కానీ వారైితే…..ఇంకొకరు)pic:www.startrekker.deviantart.com

Wednesday, March 18, 2009

sOdi


ఒక చిన ఘటన తెలుసుకుందాం.

అందరికి తెలిసినదే…..గజేంద్ర మోక్షం…………

అందమైన పర్వతాల చెంత, మనోహరమైన వనం లో నిర్మలంగా ఉన్న సెలయేటి లో,

తన సుందరమైన గజ భమినులతొ జలకాలకు దిగిన గజారాజు……ఆ సెలయేటి లోని మొసలి నోట చిక్కుటాడు. అప్పటి varaku ఆ గజేన్ద్రునితొ సరస సాల్లపాలు సాగించిన ఆడ ఏనుగులు ప్రాణాలపై తీపితొ గజేండ్రుని వదిలి ఒడ్డుకు చేరుకుని మొసలిథొ గజరాజు సాగిస్తున్న పోరాటాన్ని వేడుకతో వీక్షిస్టుంటారు.

దీనిని చక్కగా నేటి వర్తమాన కాలానికి అన్వయించుకోవచ్చు. మన జీవితం చక్కగా సాగుతున్న రోజుల్లో మన చుట్టూ ఉన్న కోలాహాలం, మనం గడ్డు పరిస్థితుల్లో ఉన్నపుడు కానరాదు.

స్థాన బలిమిథొ విజృుంబిస్తున్న మొసలి తో పోరాడి అలసిన గజరాజు, తన శక్తి కోల్పోయి, అప్పటివరకు తన వారలనుకున్నవారు తనను వీడిపోగా, తాను నమ్ముకున్న శారీరక బలం అక్కరకు రాక పోగా, పూర్వ జన్మ సుకృతం తో వివేకం మదిలో ఉదయించగా ………..

ఇహ పరాంబెరుగా నీవే తప్ప…..అని దీనంగా వెదుకుంటాడు.

ఆ కరి రాజు పూర్వ జన్మలో గొప్ప విష్ణు భక్తుడు కావటం వల్ల, ఆపత్కాళంలో నారాయణా అనగానే నేనున్ననటు పరుగెత్తుకు వచ్చాడు, భక్తికి దాసుదైన జగన్నాధుడు

మరి మనం పిలిస్తే వస్తాడా……..వస్తాడు

మరి అలా రావాలంటే ఏమి చేయాలి………….మనం కూడా అనన్య శరానాగతి చేయాలి.

ఎలా……….

ఉదయం నిదుర లేచి లేవగానే సమస్యల తొరణాలు ఆహ్వానం పలుకుతుంటే వెంకటనాధూనకు పూల మాలాలు సమర్పంచటం ఎలా?

భగవంతుని నమ్మితే, భగవంతుని వాక్యం పై కూడా నమ్మకముంచాలి….

గీత లో కృష్ణుడు చెప్పినది…….. ఒక చక్రం మొత్తం యంత్రాన్ని పని చేయిన్చే విధంగా నేను సర్వ జీవుల హృదయాలలో కొలువుంది, వారి చర్యలను నియంత్రిస్తుంటాను. అంటే మనం చేసే ప్రతి చర్య కూదా, భగవంతూనిచే నిర్దేశిన్చబదినదే,

అలాగే మనం ఎదుర్కునే సమస్యలు కూడా…… కనుక ఆ సమస్యలలనే గుది గుచ్చి పూల మాలగా సమర్పించుకుందాం.

కృష్ణుడు చెప్పాడు….పత్రం, పుష్పం, ఫలం, తోయం యో భక్త్యా సమర్పయామి…..అని

కట్టుకోవటానికి గూదు లేక అద్దె ఇళ్ళల్లొ పొద్దు పుచ్చుతుంటే, చెట్లు పెంచటానికి జాగా ఎక్కడ, ఆకులను అర్పించే తీరికెక్కడ

మూరెదు మల్లెల ధర బారెడు పొడుగునా చెబుతుంటే, ఉన్న కూసింత ఖళి కూడా వదలకుండా అద్దెల కొరకు గదులు నిర్మించే నేటి నగర జీవనంలో…..పూలా ఎక్కడ దొరికేను

ఫలమా……..ముంచుకొస్తున్న విదేశీ ఫుడ్ మోజులో మనమే తినమ్, ఇంకా పెద్దయనకా .కష్టం

జలమా……అసలే రేషానింగ్ మన అవసరాలకే చాలి చాలక ఇంకా ఆ జలధి సాఇ కి కూదాన…

మరి ఎలా

మనలో జనించే చెడు ఆలోచనలనె ఆకులను, అహంకారమనే ఫల సహితంగా

కామా క్రోధ లొభాలనే ఆరు రకాల పువ్వులతో కలిపి, ధు:ఖ మనే జలం చేర్చి సర్వ నిలయునకు సమర్పిద్దామ్. ప్రతిగా వినయ విధేయతలను, ప్రసాన్తతను తీసుకుందాం.

కృష్ణుడు చెప్పాడు….సకల చర అచర జగత్తు మొత్తం…..తానే నిండి యున్నానని.

అంటే , మనలోనూ, మన చుట్టూ ఉన్న వారిలోనూ, మనకు నచ్చని వారిలోనూ మనకు లభిన్చే పొగడ్త ల లోను, మనపై కురిసే విమర్శల జదివాన లోను, మనకు అందే లాభం లోను, మనకు కలిగే సమస్యలోనూ అంతటా ఉన్నది ఆ విస్వాత్మ krishNudE.

ఈ చిన విషయం జాగ్రత్తగా అర్ధం చేసుకోగలిగితే అంతా ఆనందమె.

మన పిల్లలకు ఆహారం అందిస్తూ………తామే యశోదా లమని, తమ చిన్నారి….ఆ నంద గోప బాలుదేనని,

తమ తల్లి తండ్రులకు, అత్త మామాలకు సేవ చేస్తు, సాక్శాత్ ఆ లక్ష్మి నారయణులను వారిలో చూడగలిగితే

తన భర్త, లేక భార్య పై అనురాగ వర్షం కురిపిస్తూ వారిలో రాధ కృష్ణులను చూడ గలిగితే

తమపై విమర్శల వర్షం కురిపిన్చే వారిలోనూ, మనం ఎదుర్కునే సమస్యల లోను మన పాపాలను పెకళిన్చే కరుణాంతరంగుడైన ఉగ్ర నరసింహుని చూద గలిగితే జీవితం….

వడ్డించిన విస్తారాకు వలె కమనీయమ్గా ఉంటుంది

ఆ ఏడు కొండలవాడు మన ఎద లోనే నిత్యం కొలువుంటాడు.
pic:http://startrekker.deviantart.com/art/Temple-trident-95205543

Thursday, March 12, 2009

vesavi


వేసవి………………..అదొక అద్బుతమైన సమయం వణికించె చలి కాలానికి విసిగించే వనాకాలానికి నడుమ ఉడికిస్తూ కూడా వూరిన్చె కాలం ఎన్నెన్నో వైభావాలకు ఆటపట్టు…..ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. వత్సరమంతా చదువుల భారంతో అలసి, వేసవి అనగానే నెల నాళ్ళ ఆటల ఆనందాన్ని , అమ్మమ్మా తాతయ్యల ఆప్యాయతలను వెతుక్కుంటూ పల్లెటూళ్లకు పరుగోఓ…….పరుగు కానీ ఇప్పుడు……….మ్మ్మ్మ్ అమ్మమ్మా………అడ్దంకి………….తాతయ్య….తలనొప్పి వంటికి అలుపునివ్వనీ, మనసును సేద తీర్చని వీడియో గేమ్స్ మాయజాలం. వేసవి…… నోరూరించే మామిడి మదుర రసాలు, చల్లని లేలేత తాటి ముంజల రుచి పసందైన పలు రకాల తెలుగు వంటకాల ఘూమ ఘూమలు……… కానీ ఇప్పుడు……….మ్మ్మ్మ్ మామిడి మదుర్యమ్ మజా బాటల్స్ లో నక్కింది. తెలుగు ఘుమఘుమలు…..ఇటాలియన్ పిజ్జాల మాటున, ఫ్రెంచ్ ఫ్రిసే వెనుక దాగింది వేసవి మత్తేకించే మల్లెల పరిమళాలు, సిగను మల్లెలు మరువాలతో అలంకరించి తాచు పాముల బుసాల్లు కొట్టే వాలుజడల వయ్యారం కానీ ఇప్పుడు……….మ్మ్మ్మ్ మల్లెల పరిమళమ్ ముక్కులనుమండిచే సెంటులో ఆవీరయ్యింది పాపం వాలుజడ తోక తెగి బోసిపోయింది వేసవి పొద్డంటా ఎండ వేడిమికి కమిలిన శరీరాలు…….సాయంకాలం అరుబయట నులక మంచం మీద చల్లగాలికి సేద తీరుతూ, నక్షత్రలను లెక్కీస్తూ కానీ ఇప్పుడు……….మ్మ్మ్మ్ ఎండాను భరించలేం……..వాన …..చిరాకు………..చలి అబ్బో పులి ఏ సి చల్లదనం మాటున అటు ఆరోగ్యం ఇటు వాతావరణం అంత కల్తీ వేసవి చక్కని హావా భావాలతో, రాగ బద్దమైన ఆలాపణలతో, చెవులకు ఇంపైన పదాలతో కూడిన పద్య నాటకాలతోనూ, నీతిని చమత్కారాన్ని, విజ్ఞానాన్ని అందించే హరికథ, జానపదాలతో అలరించే వేసవి రాత్రులు కానీ ఇప్పుడు……….మ్మ్మ్మ్ ఎడతెరిపిలేని అత్త కొడ్డళ్ల సేరియళ్ళతొను, పదారూ వయసులో చదువుల చెత్త కన్నా ప్రేమ ఎంతో మిన్న అని ప్రభొడిన్చె చెత్రలతొను,వళ్ళు గగుర్పొడిపించే పాప్ బీట్స్ తోనూ సాగే భయానక కాళరత్రులు.

ఓ మరిచాను………మనం నవ నాగరీకులమ్ కదా!

పాపం పల్లెటూరు……..మన నగరీకతను చూసి తన అమాయకత్వాన్ని తలచుకుని సిగ్గుతో ఎండిపోయింది….వేసవి కదా