Wednesday, March 18, 2009

sOdi


ఒక చిన ఘటన తెలుసుకుందాం.

అందరికి తెలిసినదే…..గజేంద్ర మోక్షం…………

అందమైన పర్వతాల చెంత, మనోహరమైన వనం లో నిర్మలంగా ఉన్న సెలయేటి లో,

తన సుందరమైన గజ భమినులతొ జలకాలకు దిగిన గజారాజు……ఆ సెలయేటి లోని మొసలి నోట చిక్కుటాడు. అప్పటి varaku ఆ గజేన్ద్రునితొ సరస సాల్లపాలు సాగించిన ఆడ ఏనుగులు ప్రాణాలపై తీపితొ గజేండ్రుని వదిలి ఒడ్డుకు చేరుకుని మొసలిథొ గజరాజు సాగిస్తున్న పోరాటాన్ని వేడుకతో వీక్షిస్టుంటారు.

దీనిని చక్కగా నేటి వర్తమాన కాలానికి అన్వయించుకోవచ్చు. మన జీవితం చక్కగా సాగుతున్న రోజుల్లో మన చుట్టూ ఉన్న కోలాహాలం, మనం గడ్డు పరిస్థితుల్లో ఉన్నపుడు కానరాదు.

స్థాన బలిమిథొ విజృుంబిస్తున్న మొసలి తో పోరాడి అలసిన గజరాజు, తన శక్తి కోల్పోయి, అప్పటివరకు తన వారలనుకున్నవారు తనను వీడిపోగా, తాను నమ్ముకున్న శారీరక బలం అక్కరకు రాక పోగా, పూర్వ జన్మ సుకృతం తో వివేకం మదిలో ఉదయించగా ………..

ఇహ పరాంబెరుగా నీవే తప్ప…..అని దీనంగా వెదుకుంటాడు.

ఆ కరి రాజు పూర్వ జన్మలో గొప్ప విష్ణు భక్తుడు కావటం వల్ల, ఆపత్కాళంలో నారాయణా అనగానే నేనున్ననటు పరుగెత్తుకు వచ్చాడు, భక్తికి దాసుదైన జగన్నాధుడు

మరి మనం పిలిస్తే వస్తాడా……..వస్తాడు

మరి అలా రావాలంటే ఏమి చేయాలి………….మనం కూడా అనన్య శరానాగతి చేయాలి.

ఎలా……….

ఉదయం నిదుర లేచి లేవగానే సమస్యల తొరణాలు ఆహ్వానం పలుకుతుంటే వెంకటనాధూనకు పూల మాలాలు సమర్పంచటం ఎలా?

భగవంతుని నమ్మితే, భగవంతుని వాక్యం పై కూడా నమ్మకముంచాలి….

గీత లో కృష్ణుడు చెప్పినది…….. ఒక చక్రం మొత్తం యంత్రాన్ని పని చేయిన్చే విధంగా నేను సర్వ జీవుల హృదయాలలో కొలువుంది, వారి చర్యలను నియంత్రిస్తుంటాను. అంటే మనం చేసే ప్రతి చర్య కూదా, భగవంతూనిచే నిర్దేశిన్చబదినదే,

అలాగే మనం ఎదుర్కునే సమస్యలు కూడా…… కనుక ఆ సమస్యలలనే గుది గుచ్చి పూల మాలగా సమర్పించుకుందాం.

కృష్ణుడు చెప్పాడు….పత్రం, పుష్పం, ఫలం, తోయం యో భక్త్యా సమర్పయామి…..అని

కట్టుకోవటానికి గూదు లేక అద్దె ఇళ్ళల్లొ పొద్దు పుచ్చుతుంటే, చెట్లు పెంచటానికి జాగా ఎక్కడ, ఆకులను అర్పించే తీరికెక్కడ

మూరెదు మల్లెల ధర బారెడు పొడుగునా చెబుతుంటే, ఉన్న కూసింత ఖళి కూడా వదలకుండా అద్దెల కొరకు గదులు నిర్మించే నేటి నగర జీవనంలో…..పూలా ఎక్కడ దొరికేను

ఫలమా……..ముంచుకొస్తున్న విదేశీ ఫుడ్ మోజులో మనమే తినమ్, ఇంకా పెద్దయనకా .కష్టం

జలమా……అసలే రేషానింగ్ మన అవసరాలకే చాలి చాలక ఇంకా ఆ జలధి సాఇ కి కూదాన…

మరి ఎలా

మనలో జనించే చెడు ఆలోచనలనె ఆకులను, అహంకారమనే ఫల సహితంగా

కామా క్రోధ లొభాలనే ఆరు రకాల పువ్వులతో కలిపి, ధు:ఖ మనే జలం చేర్చి సర్వ నిలయునకు సమర్పిద్దామ్. ప్రతిగా వినయ విధేయతలను, ప్రసాన్తతను తీసుకుందాం.

కృష్ణుడు చెప్పాడు….సకల చర అచర జగత్తు మొత్తం…..తానే నిండి యున్నానని.

అంటే , మనలోనూ, మన చుట్టూ ఉన్న వారిలోనూ, మనకు నచ్చని వారిలోనూ మనకు లభిన్చే పొగడ్త ల లోను, మనపై కురిసే విమర్శల జదివాన లోను, మనకు అందే లాభం లోను, మనకు కలిగే సమస్యలోనూ అంతటా ఉన్నది ఆ విస్వాత్మ krishNudE.

ఈ చిన విషయం జాగ్రత్తగా అర్ధం చేసుకోగలిగితే అంతా ఆనందమె.

మన పిల్లలకు ఆహారం అందిస్తూ………తామే యశోదా లమని, తమ చిన్నారి….ఆ నంద గోప బాలుదేనని,

తమ తల్లి తండ్రులకు, అత్త మామాలకు సేవ చేస్తు, సాక్శాత్ ఆ లక్ష్మి నారయణులను వారిలో చూడగలిగితే

తన భర్త, లేక భార్య పై అనురాగ వర్షం కురిపిస్తూ వారిలో రాధ కృష్ణులను చూడ గలిగితే

తమపై విమర్శల వర్షం కురిపిన్చే వారిలోనూ, మనం ఎదుర్కునే సమస్యల లోను మన పాపాలను పెకళిన్చే కరుణాంతరంగుడైన ఉగ్ర నరసింహుని చూద గలిగితే జీవితం….

వడ్డించిన విస్తారాకు వలె కమనీయమ్గా ఉంటుంది

ఆ ఏడు కొండలవాడు మన ఎద లోనే నిత్యం కొలువుంటాడు.
pic:http://startrekker.deviantart.com/art/Temple-trident-95205543

No comments: