Thursday, November 12, 2009

ముకుంద మాల


ఓ ముకుందా
శ్రీవల్లభ వరదా భక్తప్రియా దయాసాగరా
నాధా , జగన్నివాసా , శేషశయనా
ప్రతి దినం అమృతమయమైన ని నామాలను
స్మరించు వివేచన కలిగించు

దేవకీనందన దేవాధిదేవ జయము జయము
వృష్టి వంశ ప్రదీప జయము జయము
నీల మేఘశ్యామ జయము జయము
ధర్మ రక్షక జయము జయము

ఓ ముకుందా
శిరము వంచి ప్రణమిల్లి మిమ్ములను యాచిస్తున్నాను
నా రాబోవు జన్మలెట్టివైనను మి పాద పద్మములను
మరువకుండునటుల మి దయావర్షం నాపై అనుగ్రహించుము

ఓ హరి !

కుంభిపాక నరకములనుండి , జీవితపు ద్వంద్వముల నుండి
రక్షించమనో ,
మృదువైన లతల వంటి శరీరంతో కూడిన రమణీమణుల పొందుకోరి
నిన్ను ఆశ్రయించలేదు
చావు పుట్టుకల చక్రబంధం లో చిక్కుకున్న నా మదిలో
జన్మ జన్మకు ని పాదపద్మములు స్థిరంగా వుండునట్లు
అనుగ్రహించుము చాలు

ఓ దేవాధి దేవా !
నేనెంత నిరాసక్తుడైనప్పటికి పూర్వ కర్మల వాసనా బలం చేత
ధర్మాచరణ , భోగ భాగ్యాల అనురక్తి నను విడకున్నవి
కాని నేను నిన్ను కోరే గొప్పదైన వరం ఒక్కటే , జన్మ జన్మలకు
కూడా ని చరణారవిన్దాలు సేవించుకునే భాగ్యం కల్పించు .

ఓ నరకాసుర సంహార !

దివి , భువి లేక నరకం నీవు నాకు ప్రసాదించే
నివాసమేదైనప్పటికిని , మరణ సమయంలో
శరత్కాలపు నిర్మల సరోవరంలో వికసించిన నవ కమలములవంటి ని పాదములు నా మనో నేత్రంలో నిలుపు చాలు

మహా జ్ఞాని , భక్తి సామ్రాజ్యపు మహారాజు చేర (కేరళ) సామ్రాజ్యాదీసుడు కులశేఖర ఆళ్వార్ ముకుందునకు సమర్పించిన పూమాల లోని మొదటి ఆరు పూలకు భక్తి వేదాంత స్వామి వ్రాసిన ఆంగ్ల అనువాద ఆధారంగా

Friday, November 6, 2009

నేను గీత

ఎవరా గీత ఏమా గాధ
పక్కింటి అమ్మాయో లేక మరొకరో కాదు
మన రాత మార్చేందుకు భగవానుడు చెప్పిన గీత
అదే భగవద్ గీత

చిన్నప్పటి నుండి వింటూనే వున్నాం ….ఘంటసాల గళమాదుర్యం లో గీతను
కాని దానిని అధ్యయనం చేసి ఫలం పొందగలిగినది మాత్రం ఆరేడు సంవత్సరాల
క్రితం
ఎప్పటిలానే తెల్లవారినా , పొద్దు మాత్రం అనుకోని రీతిలో గ్రున్కింది
మన అనుకున్న వారి నుండి ఎదురైన వూహించని పరాభవం
మనసును మెలి తిప్పుతుంటే
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే అని విషాద గీతం
పాడుకుంటూ గది తలుపులు బిగించుకుని మనసు తలపులు తెరచి
విలపించెంతలో
గూటిలో ఎప్పుడో కొనిపడేసిన భగవద్ గీత ఓరి అమాయకుడా
నన్ను చూడరా అని పిలుస్తున్నట్లున్నది

చేతిలోకి తీసుకుని పేజి త్రిప్పగానే అర్జున విషాదయోగం …….
అది చూసి విషాదం గా నవ్వుకుంటూ చదవటం మొదలెట్టాను

కాలం గడుస్తున్నది …….అర్ధం చేసుకునే కొద్ది మోహపు
మాయ వీడి జీవితపు మర్మం తెలియరాసాగింది
దానితో పాటే గుండెల్లో గూడు కట్టిన భాద ఆవిరైపోసాగింది
చివరకు మిగిలింది ……
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం

అంతలా నన్ను ప్రభావితం చేసిన భగవద్ గీత నేడు ఎంతలా నాతొ కలసిపోయిందంటే
ఎక్కడైతే తొలి విషాదాన్ని చవి చూసానో తిరిగి అక్కడే మరో ఇబ్బందికరమైన వార్త
వినరావల్సివచ్చింది .
విశేషం …….అప్పుడు ఇప్పుడు కార్తిక మాసమే

గురు దశ మొదలవుతున్నదని , గురువు యొక్క శాపానికి గురి అయ్యానని , ఇది 18 సంవత్సరాలు కొనసాగుతుందని , ఉపసమించటానికి వైడూర్యము , కనక పుష్యరాగము ధరించమని దాని సారాంశం
మళ్ళి మొదలు …..అర్జున విషాదయోగం
మనసును మధిస్తే చివరకు దక్కిన సమాధానం ……..
నా పుట్టిన రోజు …18
భగవద్గీత లో అధ్యాయాలు …..18
అ కురుక్షేత్రం జరిగినది ……..18
ఈ గురుదశ నన్ను వెన్నంటి వుండే సంవత్సరాలు …18

మనస్సనే కురుక్షేత్రం లో మంచి చెడుల మద్య జరిగే పోరాటం లో
ధర్మాన్ని ఆలంబనగా చేసుకోమని , అందుకు తన పాద పద్మాలను
ఆశ్రయించమని , గురు శాపమనే వంకతో భగవానుడు నాకు అనుక్షణం
తెలియచేస్తున్నట్లు లేదూ

కంసుడు ప్రాణ భయంతో ఎక్కడ చూసిన కృష్ణుడిని కాంచినట్లు , ప్రతి
పనిని ఆరంభించబోయేముందు , తన పాద పద్మాలను ఆశ్రయించమని
గురు శాపమనే నెపం తో కృష్ణుడు నాకు తెలియచేస్తున్నాడు

గీత లో ఆయనే స్వయం గా పేర్కొన్నాడు … గురువులలో దేవగురువు బృహస్పతి
తానేనని . అట్టి నారాయణుని చే ఇవ్వబడిన శాపం నా పాలి వరం కావటం లో
వింతేమున్నది .

అన్నమాచార్యుల వారు కిర్తించినట్లు

శంఖ చక్రాల నడుమ సందుల వైడూర్యమై తానుండగా

కాళిన్దుని తలలపై కప్పిన పుష్యరాగమై తాను ప్రకాసిస్తుండగా

ఇక వేరే రాళ్ళు రత్నాలతో నాకు పని ఏమి
ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన భగవద్గీతకు వందనాలతో

Tuesday, September 15, 2009

ఆకాశా దేశాన


ఆకాశా దేశాన అనంతకాలపు

పయనం సాగించే ఓ మేఘమాలిక

కనుగొని విన్నవించు నా ప్రియ సఖి కి నా మేఘ సందేశం

ఘడియ ఘడియ శిలగా మారి కరగకున్నది లచ్చి

ఎద కోవెలలో ని మూర్తి తిష్టవేసినది లచ్చి

తెల్లవారు తరుణాన ని ముఖ కమలం

చిరునవ్వుల రెక్కలతో విప్పారుతున్నది లచ్చి

నాలో నవచైతన్యం నింపుతున్నది లచ్చి

అపరాహ్ణవేళ ని తలంపే

అమృత తోయమై ఆకలి తీర్చుచున్నది లచ్చి

నాలో నవచైతన్యం నింపుతున్నది లచ్చి

చీకటి పడిన వేళ కలువబాల ను

మరిపించు ని పసిడి మేని సోయగం

విరహతాపం పెంచుతున్నది లచ్చి

నాలో నవచైతన్యం నింపుతున్నది లచ్చి

ఓ మేఘ మాలికా నా ముద్దుల లచ్చి

గురుతు తెల్పెద .జాడ పట్టుకో

ఎ ఇంట అనురాగవర్షం కురుస్తున్నదో

ఎక్కడ ఆనందం వెల్లివిరుస్తుందో

ఎక్కడ ఆప్యాయత పొంగిపోరలుతుందో

ఎక్కడ మమతల మణిదీపమ్ వెలుగులు విరజిమ్ముతుందో

అదే అదే నా ముద్దుల లచ్చి చరించు తావు

Tuesday, September 1, 2009

jIvitam


జీవితం ఈ రోజుల్లో సాధారణంగా అందరి నోట విన బడే భారీ డైలాగ్ .జీవితం బోర్ కొట్టేస్తుందోయ్ ఏమిటో ఈ జీవితం .లేవటం ఆఫీసులకు పరుగెత్తటం ఇంటికి చేరటం ……కంటికి కునుకు పట్టిందనుకునేలోపే తెల్లారటం .మళ్ళి చక్రం మొదలు ఈ రోజంతా భారం గా గడిచిందోయ్ రేపన్న కాస్త సంతోషం ‘గా వుండాలని పెద్ద నిర్ణయం తీసుకుంటాం ఈ లోపు ఆ రేపు రాను వస్తుంది పోను పోతుంది కోరుకున్న సంతోషం మాత్రం కనుచూపుమేరలో కానరాదు నిజానికి ప్రతి మనిషి కోరుకునేది సంతోషం . అది ఎంత మంది పొందగలుగుతున్నారు చెప్పటం కష్టమే నాకు డబ్బుల్లేవ్ కాని వుంటే చాలా సంతోషం గా గడిపేవాడిని చాలా అమాయకపు మాట అంబాని సోదరులను తీసుకోండి .డబ్బు కుప్పలు గా మూలుగుతుంది తమ్ముడిని ఎదగనియకుండా ఎలా అడ్డుకోవాలో అని నిరంతరం అన్న ఆలోచన అన్న ఎప్పుడు ఎ విధం గా దెబ్బ తీస్తాడో తమ్ముడి తంటాలు ఆనందం అంటే వీక్ఎండ్ మందు పార్టీ లలోను , అవకాసమున్నంతకాలం విచ్చలవిడి జీవితాన్ని గడిపి తరువాత ప్రేమ గా పలుకరించేవారు కరువై మానసికం గా ఒంటరి గా మారి విషాదాంతాలు తెచ్చుకోవటం కాదు అందరికి కనువిప్పు మైఖేల్ జాక్సన్ ………కుప్పలు తెప్పలుగా సంపద , జనాల్లో పేరు కాని వ్యక్తిగతజీవితమ్ …అబ్బో పరమ దారుణం .శరీరం శిధిలమై , ఒక్క ముద్దా కడుపార తినలేక మరి ఆనందం అంటే ..సత్యాన్ని గ్రహించటం ……నిత్యమైన సత్యం కోసం అన్వేషించటం మనం గడిపే జీవితాన్ని ఒకసారి పరిశిలించి చూడండి …..మన చుట్టూ వున్న జీవజాలానికి మనకు ఎమన్నా తేడా వుందేమో వుంది ఒక్కటే ……..మనం వుండటానికి సిమెంట్ గోడలు , నాలుగు మెతుకుల కోసం పరుల వద్ద సేవ, బాంక్ బాలన్సులు వాటికి రేపటి ఆలోచన లేదు …….ఎక్కడ వీలైతే అక్కడ తలదాచుకుంటాయి వాటికి నిర్దేశించిన జీవితాన్ని క్రమం తప్పకుండా గడుపుతాయి . సమయం వచ్చినపుడే సంభోగిస్తాయి మనం ఎప్పుడు సంపాదన కోసం , ఇంద్రియ సుఖాల కోసం , ఆకలి తీర్చుకోవటం కోసం ..వీటికోసమే జీవిస్తున్నాం .కాకపొతే ఎవరికి చేతనైన పని వారు చేస్తున్నారు మరి మనం పశు పక్ష్యాదులకన్న ఎ విధం గా గొప్ప ఇలాంటి జీవితం లో ఆనందం ఎక్కడ దొరుకుతుంది అందుకే మానవ జన్మ పరమార్ధమైన సత్యాన్వేషణ చేసే వారే ఆనందపు అంచులు చూడగలరు సత్యం అంటే భగవంతుడు ………. ఆయన గూర్చి అన్వేషణ , ఆయన గాధలు వినటం ఆయన నామాన్ని నిత్యం స్మరించటం , ఆయన గుణాలను కిర్తించటం భగవంతుని సాలోక్య , సారూప్య , సామీప్య , సాయుజ్యాన్ని పొందటానికి ప్రయత్నించటం అదే మనిషి కర్తవ్యమ్ . అదే నిజమైన ఆనందానుభూతి ని అందించే గొప్ప మార్గం సత్యాన్ని అన్వేషించాతానికి గురువు తోడు అవసరం అయితే ఈ రోజుల్లో .గురువుల పేరిట మనిషి బలహినతలతో ఆడుకునే మాయగాళ్ళు అధికమైపోయారు . కనుక సద్గురువును పట్టుకోవటం మనవల్ల కాదు కనుక చక్కగా భగవంతుని గుణగణాలను మనోహరం గా వర్నిచిన పోతన భాగవతం , మహా భారతం రామాయణాలను రోజు ఒక 10 నిమిషాలు చదవటం , అన్నమయ్య , రామదాసు వంటి మహానుభావుల కీర్తనలు ఒక్కటైనా మనకు చేతనైన విధంగా పాడుకోవటం , మన నాలుక తేలిగ్గా పట్టుకోగల భగవన్నామం ఏదైనా ఒకటి ఎంచుకుని పదే పదే దానిని స్మరించటం రోజు వారి క్రమబద్దం గా చేస్తుంటే అప్పుడు మాత్రమే ఆనందపు అసలు రుచి చూడగలరు . లేకుంటే మేము చాలా ఆనదంగా వున్నమన్న భ్రమలో పాతాళానికి దిగాజారిపోగలం ఆలోచించుకోండి .ఎవరి జీవన విధానం వారిది కాదనగల వారెవ్వరూ

Thursday, August 13, 2009

భువన మోహన



భువన మోహన


ఆకాశం నుండి జాలు వారుచున్న పూల ధార వలె , శివుని వింటి నుండి దూసుకు వస్తున్న బాణ పరంపరవలె మదనుని చెరకు వింటిని తలపింపచేయు కనుబోమలతో అర్ధ నిమీలిత నేత్రాలనుండి ఎడతెరపి లేని , ప్రేమతో నిండిన , చీకట్లు తొలగితే తమను వీడిపోతాడన్న భయం తక్క మరే బెరుకు లేని నిశితమైన చూపులతో ఆ గోపకాంతలు ఆ జగన్మోహనా కారుడి సౌందర్య మధువును ఆస్వాదిస్తున్నారు . ఎర్రని దొండపండు వంటి , తేనెలూరు పెదవుల నుండి వెలువడుచున్న కాంతితో వెలుగుచున్న ఆ కృష్ణుని ముఖ సౌందర్యం చూపులను ప్రక్కకు తిప్పనీయకున్నది ఎర్ర తామర రెక్కలను పోలిన అరచేతులలో వున్న వేణువు , పెదవుల తీయదనాన్ని తన వేణుగాన తరంగాలలో నింపుకుని కర్ణ పుటాలను సోకి మనసులో మదుర భావనలు రేకెత్తిన్చుచున్నది గోపికల నుదుటి కుంకుమతో నిండిన కృష్ణుని దేహం అరుణ వర్ణపు భానుని వలె శోబిల్లుతుంది . భహుశా ఇట్టి లోకైక నిత్య సత్య సౌందర్యాన్ని చూచే కాబోలు రుక్మిణి ఇలా భావించింది .

ప్రాణేస ని మంజు భాషణలు వినలేని

రంద్రముల కలిమి యేల !

పురుష రత్నమా ! నీవు భోగింపగా లేని

తనులత వలని సౌందర్యమేల

మోహన ! నిన్ను పొడగానగా లేని

చక్షురింద్రియముల సత్వమేల !

దయిత ! ని యధరామృతం బానగా లేని

జిహ్వకు ఫల రస సిద్ది యేల !

నీరజాత నయన ! ని వనమాలికా

గంధ మబ్బలేని ఘ్రాణమేల !

ధన్య చరిత ! నీకు దాస్యంబు సేయని

జన్మ యేల ? ఎన్ని జన్మములకు ?

(పోతన భాగవతం )

Wednesday, July 15, 2009

aarOgya sUtram


ఈ రోజుల్లో అతి సాధారణ సమస్య ఆరోగ్యం వారి వారి సమస్యలకు తగు రీతి లో చికిత్స పొందలేని వారు ఎందఱో అందులో భగవంతుని పై నమ్మిక వున్న వారి కోసమే ఇది . వాస్తవానికి ఆరోగ్య సమస్యలు అనేవి మనం చేసే తప్పులకు బదులుగా మనకు లభించే , తిరస్కరించలేని బహుమానాలు ఇవి మనకు ఇబ్బంది నే తప్ప , సంతోషాన్ని ఇవ్వలేవు
అందుకోసం ఒక పని చేద్దాం ప్రతి రోజు ఉదయం ప్రశాంతం గా విష్ణు ధ్యానం లో గడుపుదాము ఈ విధంగా ధ్యానం చేద్దాం మన దేహం లో 70 శాతం నీరే వుంటుంది నీరు నారాయణుని వీర్యం నుండి ఉద్భవించింది వీర్యం తేజో వంతమైనది , చైతన్య స్వరూపం అందుకే నీరు మనకు ప్రాణాధారమైనది (మనలో చెడు భావాలు , కోపోద్రేకాలు వచ్చినపుడు కొన్ని రకాల ఆమ్లాలు (రసాయనాలు ) ప్రేరేపితమవుతాయి అవే మన శరీరం లో పేరుకుని రోగకారక క్రిమి ఉత్పాదనకు కారణమవుతాయి కనుక రోగాలు రాకుదదంటే మనం మన ఆలోచనలు నియంత్రించుకోవాలి . అది కుదరదు కనుక ఈ చిట్కాలు పాటిద్దాం ) ప్రళయకాలం లో వటపత్ర సాయి గా సమస్త లోకాన్ని రక్షించే నారాయణుని మనసులో భావన చేసుకుందాం ఎ విధంగా అంటే మర్రి ఆకు మీద , చిన్ని శిశువు రూపంలో , నోటి యందు కుడి కాలి బొటన వ్రేలు పెట్టుకుని అమాయకపు చూపులతో వున్న ఆ వెన్న దొంగ రూపాన్ని భావించుకోవాలి ముందు చెప్పుకున్నాం కదా శరీరం అంతా నీటి తో నిండి వుంటుందని కాలి వేళ్ళ నుండి మొదలు పెట్టి తల వెంట్రుకల వరకు , ప్రతి అవయవాన్ని కూడా స్పర్శిస్తూ మర్రి ఆకు అనే తెప్ప మీద శిశువు రూపం లో వైద్య నారాయణుడు సాగిపోతున్నట్లు , ఆయన స్పర్స తాకిన చోట అంతా పేరుకుపోయిన చెడు అంతా తొలగి , చక్కని ఆరోగ్యవంతమైన భాగం గా మారినట్లు భావన చేయండి ఇలా రోజు క్రమం తప్పకుండా ఒక 15 నిమిషాలు చేయండి ఆరోగ్యం మీ సొంతం అలాగే రోజు , పరగడుపున , ఏదైనా తినటానికి 40 నిమిషాలముందు 4 గ్లాసుల మంచి నీరు త్రాగండి నీరు మీ శరీరం లో పేరుకున్న వ్యర్ధ రసాయనాలు కరిగించి బయటకు నెట్టి వేస్తుంది మరి నీరే నారాయణుడు కదా

Thursday, July 9, 2009

హనుమ వస్తుండు …….అవును నిజం మా ఇంటికి వస్తుండు


హనుమ వస్తుండు …….అవును నిజం మా ఇంటికి వస్తుండు నన్ను కాచుకొన ఏమిటలా చూస్తున్నారు …నమ్మశక్యం గా లేదా సరే విషయం ముందు నుండి చెబుతాను అప్పుడైనా నమ్మకం కలుగుతుందేమో అనగనగా ఒక రోజు ..ఎప్పటి లానే తెల్లారింది రోజువారి వురుకులు పరుగులతో ఆఫీస్ చేరుకుని పని మొదలెట్టాం కడుపులో పడ్డ కూడు కంటికి కునుకు తెప్పిస్తున్న వేళ మనసుకు జోల పాడే సమయం కాదు కనుక , హుశారేత్తించటం కోసం ఒకసారి అలా రేడిఫ్ఫ్ బాల్ లోకి తొంగి చూసా ముత్యాల సరాల వంటి పలు వరుసను ప్రదర్శిస్తూ , తళుకులినుతున్న చిరు నగవుతో ఓ చిలకమ్మ పలకరింపు హాయ్ అంతే , ఒక్కసారిగా మాయమయ్యింది నిదుర మబ్బు …అదే మగజాతికి పెద్ద జబ్బు రేకుల డబ్బాలో గులక రాళ్ళ కదలిక ను పోలిన శబ్దంతో కూడిన నవ్వు ఆపై బదులు పలకరింపు పరిచయాలు …..పోసుకోలు కబుర్లు చివరగా బై బై లు మళ్ళి పనిలో పడ్డాం మెరుపు తోడు లేని ఉరుములా ఓ మేఘ గర్జన ఎవరది ?మీ పేరు నా రేడిఫ్ఫ్ ఫ్రెండ్స్ లిస్టు లోకి ఎలా వచ్చింది ?నేను మీకు తెలుసా ? పార్ధుడి గాండీవం నుండి దూసుకు వస్తున్న శరాల్లా ప్రశ్నల పరంపర . హటాత్పరిణామానికి …… ముందు ఉలికిపాటు ఆ పై తత్తరపాటు సర్దుకుని , సావధానం గా చూస్తే , మధ్యాహ్నం నవ్విన చిలకమ్మే ఇప్పుడు గర్జిస్తుంది ఆశ్చర్యపడుతూ మాటా మంతి కలిపితే ఏతావాతా తేలిందేమంటే , ఆ చిలకమ్మ చెల్లి అని మేఘ గర్జన అక్కదని అక్క మెయిల్ నుండి చెల్లి పరిచయం చేసుకున్దన్నమాట విషయం మా ఇద్దరికీ అర్ధమయ్యాక , తన తొలి మాట నువ్వు మంచి అబ్బాయి వేనా ? నేను అవును అంటే , ఎక్కడో వున్నా నీవేల నిర్ణయించుకోగాలవు మంచి వాడనో కాదో ? ఒక్కోసారి ప్రశ్నకు ప్రశ్నే సమాధానం . అలా మొదలైన పరిచయం అత్మీయతకు దారితీసింది నాకు హిందీ రాదు , తనకు ఆంగ్లం రాదు . ఇక తెలుగన్నదే తెలియదు కాని భావాలూ పంచుకోటానికి భాష అడ్డం కాలేదు లంకను లంఘించి , సీతమ్మ వద్దకు రామ దూత గా వెళ్ళిన హనుమయ్య మా ఇద్దరి మద్య వారధి కట్టాడు మన నాలుక పలికే మాట లోను , ఆ మాటను పుట్టించే మనసులోనూ స్వచ్చత వున్నపుడు బంధాలు అవే బలపడతాయి .ఆ ఆత్మీయ బంధం కల కాలం నిలవటానికి ఆ భగవంతుడు కూడా సాయపడతాడు ఇది నా స్వానుభవం (ఒక్కటి మాత్రం నిజం …మగువ మనసంత నిర్మలమైనది కాదు మగవాడి మనసు .కృష్ణా ! తెలిసో , తెలియకో , లేక ని మాయాప్రభావం చేతనో ఎప్పుడైనా నా మనసు జారి వుంటే క్షమించు . ఇక ముందెన్నడూ జారనియకు ) ఇలా కొద్ది కాలం గడిచాక , మా మిత్రురాలికి వివాహం జరగటం , తానూ తన అర్ధాంగుడైన పతి తో పాటుగా వెడలిపోతూ మిత్రమా , మిమ్ము ఎన్నటికి మరచిపోను , మీకు నా బహుమతి గా హనుమంతుడిని మీ ఇంటికి పంపుతానని మాట ఇచ్చి తాత్కాలిక వీడ్కోలు పలికింది ఆ తరువాత చాలా కాలం ఎలాంటి సమాచారం లేదు . తనకు నెట్ సౌకర్యం లేకపోవటం వలన . నేను మామూలు గా నా పనిలో పడి పోయాను ఎప్పుడన్నా ఒకసారి అనుకునే వాడిని ఎలా వున్నదో మా హితురాలు అని ఓ సాయంత్రం , రేడిఫ్ఫ్ ఐ లాండ్ లో నరసింహ అనే బ్లాగ్ పెట్టటానికి , నెట్ సెంటర్ కు వెళ్లి యధాలాపం గా రేడిఫ్ఫ్ బాల్ చూసా ఆశ్చర్యం నా ఆప్తురాలు …..చాలా కాలం తరువాత కుశలం అడుగుతుంది చెప్పలేనంత సంతోషం ….అంతలోనే పట్టరాని దిగులు అప్పటికే తానూ ఆఫ్ లైన్ . సరియ సరియ మెసేజ్ చూసాను , వాటి సారాంశం హనుమంతుడు మీ వద్దకు రావటానికి సిద్దం గా వున్నాడు అః ! ఎంతటి శుభవార్త కొత్తగా వివాహమయి , పెండ్లి కళ ఇంకా మాయమవలేదు , అత్తా వారింట , అత్తా మామలకు సపర్యలు చేసుకుంటూ , అర్ధంగుడికి చక్కని మనోల్లాసాన్ని కలిగిస్తూ , తీరిక లేకుండా గడుపుతూ కూడా ,కాసింత తీరిక చేసుకుని , నా హితం కోరి , తన ప్రభువైన హనుమంతుడిని నా ఇంటికి పంపించటానికి సిద్దం చేసింది ఏమిటలా చూస్తున్నారు ….మళ్ళి ఆవిడెవరో చెప్పట మేమిటి ……హనుమానుడు రావటమేమిటనా అదే భగవంతుడి గొప్పదనం తననే , త్రికరణ శుద్ది గా నమ్మి , తన శరణాగతి పొందిన భక్తులకు ఆయన సేవ చేస్తాడు . వారు ఏమి కోరితే అది చేస్తాడు కనుకనే , తన భక్తురాలు అయిన మా మిత్రురాలి కోరిక మన్నించి మా ఇంటికి రావటానికి సంసిద్దుదయ్యాడు , తోమ్మిదేండ్ల పసి ప్రాయం లో , వచ్చిన కలను నమ్మి , నాటి నుండి నేటి వరకు తెల్లవారు ఝామున 4 గంటలకు నిదుర లేచి , ఆ రామ దూత కు హారతి ఇచ్చి సేవ చేస్తూ తల్లి తండ్రులను గౌరవిస్తూ ,సంస్కారవంతమైన నడవడిక , శరత్కాలపు చంద్రుని చల్లదనాన్ని మరపించు చల్లని మనసు కలిగి వున్న నా అత్మీయుడి , తన పాదాలనే హృదయకమలం లో నింపుకున్న తన భక్తురాలి కోరిక మేరకు హర్యానా లోని కురుక్షేత్ర సమీపాన వున్న జింద్ నుండి మన భాగ్యనగరికి ఈ అభాగ్యుడి ఇంటికి రాబోతున్నాడు హనుమాన మహా ప్రభు హే హనుమా రోజు ని చరణారవిన్దాలను దర్శించుకొని , మంగళ హారతులతో , కర్పూర నిరాజనాలిస్తూ షడ్రసోపేతమైన రుచులతో కూడిన నైవేద్యమిస్తున్న ని ముద్దుబిడ్డ వద్ద నుండి ఈ మూఢుని గృహమునకు విచ్చేయుచున్నవా నేనేమి ఈయగలవాడను నా ఆలోచనలనే అప్పాలుగా నైవేద్యమిచ్చేద నా మనసునే మందార మాల చేసెద నా ఉచ్చ్వాస నిస్స్వాసాలనే ఉయాల చేసెద నా హృదయాన్నే పిఠం చేసెద నా దేహాన్ని తివాచి గా పరచి స్వాగతం పలుకుతున్నాను ప్రభు నన్ను , నా వంశాన్ని సంరక్షింప , ని ప్రసాద ఫలం గా లభించిన నా ఆప్తులకు ఆశీస్సులోసగా వేగిరమే రమ్ము ……..వేయి కనులతో వేచి వుంటిని తండ్రి .
పిక్: సంజన దత్త