Tuesday, May 7, 2013

హేమాచల నృసింహ

హేమాచల నృసింహ హేమాచల నృసింహ క్షేత్రం వరంగల్ జిల్లా లోని మంగపేట సమీపంలోని మల్లూరు గ్రామంలో ఉన్న హేమాచల శిఖరం మీద చెంచులక్ష్మీ ఆదిలక్ష్మి సమేతుడైన నరసింహ క్షేత్రం భగవంతునిపై ప్రేమ ఉన్న ప్రతిఒక్కరు సందర్శించాల్సిన పవిత్ర ప్రదేశం చుట్టూ అడవులతో అలరారే అందాల దివ్య ధామం . మొదటిసారి హైదరాబాద్ నుండి బయలుదేరి హన్మకొండ చేరుకొని అక్కడనుండి మంగపేట బస్సు ప్రయాణం (హన్మకొండ నుండి భద్రాచలం వెళ్ళే కొన్ని బస్సులు నేరుగా మల్లూరు గుట్ట వెళ్ళే దారి దగ్గర మనలను వదులుతాయి. అక్కడ నుండి 3 కి మీ , ఆటోలు వుంటాయి ,200 అడుగుతారు) ములుగు దాటగానే ఎటూరునాగారం అటవీ ప్రాంతంలోకి అడుగేడతాం . కేవలం బస్సులో వెళుతూ చూసిన మాత్రానికే మనసు ఎంతో ఉల్లాసం గా మారిపోతుంది అలా అందమైన ప్రకృతికి పరవశించి పోతూ హేమాచాలాన్ని చేరుకుంటే అదో ఆద్భుతమైన వనాంచలమ్ మండిపోతున్న ఎండల్లో సైతం కంటికి నిండుగా పచ్చదనం తో ఫరిడవిల్లె అందాల కొండ ఎటుచూసినా ఇనుము ఇటుక తప్ప మరేమీ చూడలేని కనులు కనువిప్పు పొందాయనిపించింది ఆ కొండను చూసి ఆఫీసులో కంప్యూటర్ తెరకి , ఇంటికొచ్చి టీ వీ తెరకు కంటిని అంకితం చేసి సొల్లు ఫోనులకు చెవిని బానిసను చేసి , సంపాదన కోసం బ్రతుకుని బాసులకు తాకట్టు పెట్టి గడిపేస్తున్న ఈ జీవితం ఎంత హేయమైనదో , హేమాచల దర్శనం తెలియచేస్తుంది జీవితం ఎంత గొప్పదో , ఎందుకు పూర్వీకులు పల్లె భారతాన్ని నిర్మించారో , భూమికి భారంగాను జనాభా లెక్కింపుకు భారంగాను తప్ప మరెందుకు కొరగాని మన బస్తీ బ్రతుకులు కొల్పొతున్నదేమిటొ హేమాచల దర్శనం తో తెలిసిపోతుంది అది భగవంతుని లీలా విలాసాలకు ఒక దర్పణం . కొండలో స్వయం వ్యక్తమైన ఆ శ్రీ లక్ష్మి నృసింహుని నాభి ప్రాంతం లలిత లావణ్యమై మెత్తగా మానవుని నాభి వున్నట్లు వుంటుంది అక్కడే పారే చింతామణి జలపాతపు నీరు ఒక్కసారి మన నోటిలో పోసుకుంటే , మనం త్రాగుతున్న జలం గుర్తుకువచ్చి ఇక్కడే ఈ నీరు త్రాగుతూ వుండిపోవాలనిపిస్తుంది పాహి పాహి అరుణాచల శివ శరణు శరణు హేమాచల నృసింహ

No comments: