Friday, November 6, 2009

నేను గీత

ఎవరా గీత ఏమా గాధ
పక్కింటి అమ్మాయో లేక మరొకరో కాదు
మన రాత మార్చేందుకు భగవానుడు చెప్పిన గీత
అదే భగవద్ గీత

చిన్నప్పటి నుండి వింటూనే వున్నాం ….ఘంటసాల గళమాదుర్యం లో గీతను
కాని దానిని అధ్యయనం చేసి ఫలం పొందగలిగినది మాత్రం ఆరేడు సంవత్సరాల
క్రితం
ఎప్పటిలానే తెల్లవారినా , పొద్దు మాత్రం అనుకోని రీతిలో గ్రున్కింది
మన అనుకున్న వారి నుండి ఎదురైన వూహించని పరాభవం
మనసును మెలి తిప్పుతుంటే
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే అని విషాద గీతం
పాడుకుంటూ గది తలుపులు బిగించుకుని మనసు తలపులు తెరచి
విలపించెంతలో
గూటిలో ఎప్పుడో కొనిపడేసిన భగవద్ గీత ఓరి అమాయకుడా
నన్ను చూడరా అని పిలుస్తున్నట్లున్నది

చేతిలోకి తీసుకుని పేజి త్రిప్పగానే అర్జున విషాదయోగం …….
అది చూసి విషాదం గా నవ్వుకుంటూ చదవటం మొదలెట్టాను

కాలం గడుస్తున్నది …….అర్ధం చేసుకునే కొద్ది మోహపు
మాయ వీడి జీవితపు మర్మం తెలియరాసాగింది
దానితో పాటే గుండెల్లో గూడు కట్టిన భాద ఆవిరైపోసాగింది
చివరకు మిగిలింది ……
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం

అంతలా నన్ను ప్రభావితం చేసిన భగవద్ గీత నేడు ఎంతలా నాతొ కలసిపోయిందంటే
ఎక్కడైతే తొలి విషాదాన్ని చవి చూసానో తిరిగి అక్కడే మరో ఇబ్బందికరమైన వార్త
వినరావల్సివచ్చింది .
విశేషం …….అప్పుడు ఇప్పుడు కార్తిక మాసమే

గురు దశ మొదలవుతున్నదని , గురువు యొక్క శాపానికి గురి అయ్యానని , ఇది 18 సంవత్సరాలు కొనసాగుతుందని , ఉపసమించటానికి వైడూర్యము , కనక పుష్యరాగము ధరించమని దాని సారాంశం
మళ్ళి మొదలు …..అర్జున విషాదయోగం
మనసును మధిస్తే చివరకు దక్కిన సమాధానం ……..
నా పుట్టిన రోజు …18
భగవద్గీత లో అధ్యాయాలు …..18
అ కురుక్షేత్రం జరిగినది ……..18
ఈ గురుదశ నన్ను వెన్నంటి వుండే సంవత్సరాలు …18

మనస్సనే కురుక్షేత్రం లో మంచి చెడుల మద్య జరిగే పోరాటం లో
ధర్మాన్ని ఆలంబనగా చేసుకోమని , అందుకు తన పాద పద్మాలను
ఆశ్రయించమని , గురు శాపమనే వంకతో భగవానుడు నాకు అనుక్షణం
తెలియచేస్తున్నట్లు లేదూ

కంసుడు ప్రాణ భయంతో ఎక్కడ చూసిన కృష్ణుడిని కాంచినట్లు , ప్రతి
పనిని ఆరంభించబోయేముందు , తన పాద పద్మాలను ఆశ్రయించమని
గురు శాపమనే నెపం తో కృష్ణుడు నాకు తెలియచేస్తున్నాడు

గీత లో ఆయనే స్వయం గా పేర్కొన్నాడు … గురువులలో దేవగురువు బృహస్పతి
తానేనని . అట్టి నారాయణుని చే ఇవ్వబడిన శాపం నా పాలి వరం కావటం లో
వింతేమున్నది .

అన్నమాచార్యుల వారు కిర్తించినట్లు

శంఖ చక్రాల నడుమ సందుల వైడూర్యమై తానుండగా

కాళిన్దుని తలలపై కప్పిన పుష్యరాగమై తాను ప్రకాసిస్తుండగా

ఇక వేరే రాళ్ళు రత్నాలతో నాకు పని ఏమి
ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన భగవద్గీతకు వందనాలతో

1 comment:

పరుచూరి వంశీ కృష్ణ . said...

manishi puttagane edustaadu ante vishadame kadaa..anduke geeta koda arjuna vishada yogam to modalavutundi ta ..maanava jeevanam to mudi padinade geeta...chaala baaa raasaru