Monday, December 8, 2025

రమణీయ

 అత్యద్భుత రమణీయ దీప్తిలక్ష్మీ

అనర్ఘ్యరమణీయ కాంతిలక్ష్మీ

మణిదీప్త విలాసహాసలక్ష్మీ
హృదయరాగ రంజిత మనోజ్ఞలక్ష్మీ

ఆకాశరాజు కంఠహారమౌ హరివిల్లులా
భూకాంత సిగ లో పూచిన హసితచంద్రలక్ష్మీ
అందుకో మీకై అల్లిన అభినందన చందన అక్షరలక్ష్మి

ఓ అత్యద్భుతమైన, రమణీయమైన కాంతులతో వెలిగిపోయే లక్ష్మీ! నీవు వెలకట్టలేని సౌందర్య రాశివి.

రత్నాల వంటి ప్రకాశంతో, విలాసవంతమైన నవ్వులు చిందించే ఓ లక్ష్మీ! హృదయంలోని ప్రేమ అనే రాగంతో రంజిల్లే మనోహరమైన దానివి నీవు.

ఆకాశరాజు మెడలోని హారమైన ఇంద్రధనస్సు లాగా, భూదేవి కొప్పులో పూసిన నవ్వుల చంద్రుడి లాగా ప్రకాశించే ఓ లక్ష్మీ!

మీ కోసం ప్రత్యేకంగా అల్లిన, చందనం వంటి చల్లని ఈ అభినందన అక్షరాల కవితను అందుకోండి.


Friday, December 5, 2025

దేహ బృందావని

 


దేహ బృందావని లో  మానస రాస మండలమున 

గోపికాభావమొందిన బుద్ది పలికెడి శ్రీకృష్ణ పల్కుల 
నాలకించి రాధాశ్యాములాడిరి ఆనంద నృత్యహేల 
నా దేహంబెల్ల క్రిష్ణ ప్రేమపారవశ్యజల్లుల తడపగ 

కవితా భావం (Meaning):

ఈ కవిత ఒక భక్తుని యొక్క అంతర్గత ఆధ్యాత్మిక అనుభూతిని అద్భుతమైన రూపకాలతో వివరిస్తుంది. ఇది కేవలం బాహ్య పూజ కాదు, శరీరమే దేవాలయంగా మారిన స్థితి.

  1. దేహ బృందావనిలో మానస రాస మండలమున: కవి తన భౌతిక శరీరాన్నే పవిత్రమైన 'బృందావనం'గా భావిస్తున్నారు. తన మనస్సును శ్రీకృష్ణుడు గోపికలతో ఆడిపాడిన 'రాస క్రీడా స్థలం' (రాస మండలం) గా ఊహించుకుంటున్నారు. అంటే, మనసు దైవ చింతన అనే నాట్యానికి వేదికైంది.

  2. గోపికాభావమొందిన బుద్ది పలికెడి శ్రీకృష్ణ పల్కుల: సాధారణంగా తర్కంతో ఆలోచించే 'బుద్ధి', ఇక్కడ తర్కాన్ని వదిలి, శ్రీకృష్ణునిపై అనంతమైన ప్రేమ కలిగిన 'గోపిక' భావాన్ని పొందింది. అలా పవిత్రమైన బుద్ధి, ఇప్పుడు స్వయంగా శ్రీకృష్ణుని మాటలను (దైవ జ్ఞానాన్ని) పలుకుతోంది.

  3. ఆలకించి రాధాశ్యాములాడిరి ఆనంద నృత్యహేల: ఆ దైవ వాక్కులను విని, తనలోని జీవాత్మ (రాధ) మరియు పరమాత్మ (శ్యాముడు/కృష్ణుడు) ఒక్కటై, ఆనందంతో కూడిన దివ్యమైన నాట్యాన్ని చేస్తున్నారు.

  4. నా దేహంబెల్ల క్రిష్ణ ప్రేమపారవశ్యజల్లుల తడవగ: ఆ అంతర్గత దివ్య నాట్యం వల్ల కలిగిన ఆనందం ఎంతటిదంటే, అది కృష్ణునిపై ప్రేమ అనే పారవశ్యపు జల్లులుగా మారి, కవి శరీరం మొత్తాన్ని తడిపి ముద్దచేస్తోంది. ఇది అత్యున్నతమైన భక్తి పారవశ్య స్థితి.


కవితతో కూడిన చిత్రపటం:

మీరు కోరినట్లుగా, ఈ కవితలోని భావాన్ని ప్రతిబింబించేలా ఒక చిత్రాన్ని రూపొందించి, అందులో ఈ కవితను పొందుపరచడం జరిగింది.

చిత్ర వివరణ: ఈ చిత్రంలో ఒక వ్యక్తి ధ్యాన ముద్రలో ఉన్నట్లు, అతని శరీరమే ఒక బృందావనంగా మారినట్లు చూపబడింది. అతని హృదయ స్థానంలో 'మానస రాస మండలం' ప్రకాశిస్తోంది. అక్కడ రాధాకృష్ణులు ఆనంద తాండవం చేస్తున్నారు. ఆ నాట్యం నుండి వెలువడిన కృష్ణ ప్రేమ అనే కాంతి జల్లులు ఆ వ్యక్తి శరీరం మొత్తాన్ని ఆవరించి, పారవశ్యంలో ముంచెత్తుతున్నట్లుగా ఈ చిత్రం రూపొందించబడింది.


(Google Banana -Picture)

Tuesday, December 2, 2025

మార్గశీర్ష శుద్ధ త్రయోదశి

 మార్గశీర్ష శుద్ధ త్రయోదశి


మార్గశిర మాసమే ప్రత్యేకం. శ్రీకృష్ణమాసం. శివ పార్వతుల కళ్యాణం జరిగిన మాసం. శరవణ భవుడు ఉదయించిన మాసం . దత్తాత్రేయ గురువరేణ్యుడు జనించిన మాసం. శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి అర్జునుని ముఖతా గీత భోధించిన మాసం  

అట్టి ఈ ‌మాసంలో శుద్ధ త్రయోదశీ ప్రత్యేకమైనది. ఈ రోజు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు సువర్చల ను హనుమకు ప్రసాదించిన రోజు.  సువర్చల అంటే చక్కని వర్చస్సు కలిగినది అని. అంటే చక్కని ముఖకాంతి ఎవరికి వుంటుంది. ఎవరికి సుజ్ఞానం
వుంటుందో వారికే సువర్చస్సు వుంటుంది. జ్ఞాన ప్రదాత అయిన సూర్యభగవానుడు హనుమకు చక్కని జ్ఞానం ప్రసాదించిన రోజు ఈరోజు. సువర్చస్సుతో కూడినవాడు కనుకే హనుమ అందరికీ ఇష్టుడు.
(
అలాగే ఇదేరోజు హనుమ అశోకవనంలో శింశుపా వృక్షం కింద సీతమ్మను దర్శించిన రోజు. శ్రీరామ వియోగ దుఃఖభారంతో వున్న సీతమ్మకు రాముని అంగుళీయకాన్నిచ్చి సంతోషం కలిగించిన రోజు ఈరోజు. అందుకే హనుమను ఉద్దేశించి సీతమ్మ పలికిన ఈ పలుకులే మహామంత్రమై మనలను ఎల్లవేళలా కాపాడతాయి.

త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా | 
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ || 

ఓ కపిశ్రేష్టుడా కార్యములను సమర్ధవంతంగా నిర్వహించుటకు నీవే అత్యుత్తమ ప్రమాణము(ఉదాహరణ). ఓ హనుమా నీవే ప్రయత్నపూర్వకంగా మా దుఃఖములను తొలగించుము.

మన హృదయమనే అశోకవనం (ఎల్లప్పుడూ ఆనందంగా వుండటం హృదయం యొక్క సహజ స్వభావం ) లో నివసించే చైతన్యస్వరూపమైన శక్తి  మోహమనే రావణమాయ తో కప్పబడి మన మనసు వివిధమైన వ్యాకులతలకు లోనవుతుంది . 

సుజ్ఞానమనే శ్రీరామ భక్తిని ఆశ్రయించిన బుద్ధికుశలత అనెడి కార్యశీలుడగు హనుమ  తన ప్రయత్నబలంచేత మన హృదయకుహరాన్ని కప్పివేసిన మోహపురావణుడిని తొలగించి హృదయ అశోకవనిలో కొలువైవున్న చైతన్యస్వరూపాన్ని ప్రజ్వలింపచేసుకుంటే ఆ దేహమే అయోధ్య . ఆ మనోమందిరమే శ్రీరామ అంతఃపురం . 

రోజూ ఈ భావం చేస్తూ సీతమ్మ చేత ప్రసాదించబడిన ఈ శ్లోక మంత్రాన్ని మూడు సార్లు మననం చేసుకుంటే రోజంతా సుఖప్రదం ఆనందమయం.  

Tuesday, November 25, 2025

Friday, November 14, 2025

క్రిష్ణ

 నిరంతరముగా క్రిష్ణ నామమును

 క్రిష్ణ లీలా మహిమను జపించిన
మాయదుమ్ము కమ్మిన హృదయ 
దర్పణం శరత్కాల పూర్ణిమా బింబమగు

ఆ నామం ప్రాపంచికవిషయ బడబాగ్ని కి దగ్ధమవుతున్న హృదయవనాన్ని చల్లార్చు 
చల్లని చందనపు వానజల్లు  

ఆ నామం,  భగవత్ జ్ఞానాన్ని దాచుకున్న   కలువ హృదయాన్ని వికసింప చేయుచూ ప్రవహించు చంద్రకాంతి

ఆ నామం, ఓ మనసా  నిను
ఆనంద తరంగాలలో లోతుగా మునకలెత్తించు

నిరంతరం క్రిష్ణ నామాన్ని జపిస్తూ,
అడుగడుగునా క్రిష్ణనామ అమృతాన్ని రుచి చూస్తూ,

అలసిపోయిన ఆత్మలకు ఓదార్పు
 స్నానం చేయించు క్రిష్ణ నామంలో స్నానం చేస్తూ

ప్రతి క్రిష్ణ నామంలో క్రిష్ణశక్తి నివసిస్తుంది.

కాలాలు నిర్ణయించబడలేదు, ఏ ఆచారాలు అవసరం లేదు  క్రిష్ణనామ జపానికి,

ఓ క్రిష్ణా నీ దయ చాలా విశాలమైనది.
అని పలికెనీ రాధానామ విరహాంతరంగుడు బంగరు వన్నె మెరయు లక్ష్మీ దాసుడా చైతన్యమహాప్రభు నిద్రాణమౌ మా క్రిష్ణచైతన్యము మేల్కొలప

Tuesday, September 23, 2025

క్రిష్ణ కథ (శ్రీక్రిష్ణ లీలావిలాస హాస )

 క్రిష్ణ కథ  (శ్రీక్రిష్ణ లీలావిలాస హాస )



ఎవరి పాదపద్మాలను ఆశ్రయించటం వల్ల శ్రీక్రిష్ణుని పై దృఢమైన భక్తి ఏర్పడుతుందో ఎవరు శ్రీకృష్ణునకు ప్రాణప్రదురాలైన సహోదరియో అట్టి మాయమ్మ  దుర్గమ్మకు  నమస్కరిస్తూ గొప్పదైన క్రిష్ణ కధ తెలుసుకుందాం

ముందుగా నాకెంతో ఇష్టమైన పూతన మోక్షం లోని రహస్యాలను తెలుసుకుందాం.  అందరికీ తెలిసినదే ... పూతన కంసుడి సోదరి . కంసుడు పంపగా గోకులంలో  యశోద ఇంటికి వచ్చి అందమైన స్త్రీ రూపం ధరించి కృష్ణుడికి విషపు పాలు ఇవ్వబోగా అయన పాలతో పాటు పూతన ప్రాణాలు కూడా లాగి పూతనను సంహరించాడు. ఇంతవరకూ అందరికి తెలిసినదే.

తరువాత జరిగింది .. ఎప్పుడైతే కృష్ణుడు పూతన ప్రాణాలను బయటకు లాగేశాడో అప్పటివరకూ అందమైన స్త్రీ రూపంలో వున్న  పూతన శరీరం అసలు రూపాన్ని పొంది భీకరమైన ఆకారంతో కిందపడిపోయింది. ఆ శరీరాన్ని అక్కడనుండి అతి కష్టం మీద అక్కడ నుండి తీసుకెళ్లి దహనం చేస్తే ఆ కాలుతున్న శరీరం నుండి  ఎంతో గొప్పదైన పరిమళాలు వెలువడ్డాయి. అది చూసి గోకులవాసులంతా ఎంతో ఆశ్చర్యపోయారు.
 అంతేకాదు అంతకుమించిన ఆశ్చర్యకరమైన సంఘటన ... కృష్ణుని చేత బయటకు లాగబడిన పూతన యొక్క ప్రాణ శక్తి (సూక్ష్మ శరీరం ) దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. అపుడే అక్కడకు   నూఱు చక్రాలు కలిగిన , రత్నములతో నిర్మించబడి , అగ్ని చేత శుద్ధి చేయబడిన వస్త్రములతో అలంకరించబడి,  చేతులలో వింజామరలు , దర్పణాలు  పట్టుకున్న వేలకొలది శ్రీక్రిష్ణ పార్షదులతో (అనుచరులు)  కూడిన ఒక దివ్యరథం క్రిందకు వచ్చింది . అందులోని పార్షదులు ఎంతో భక్తిభావంతో పూతన సూక్ష్మ శరీరాన్ని రథంలో కూర్చుండబెట్టుకుని  అత్యంత దుర్లభమైన గోలోకానికి తీసుకెళ్లారు.

దీని వెనుక దాగిన రహస్యం ఏమిటీ ... ఎవరినైనా అడిగితే ఏమని చెబుతారు... శ్రీకృష్ణుని చేత సంహరింపబడినది కనుక ఆమె దుర్గణాలన్నీ పోయి మోక్షం వచ్చింది అని చెబుతారు

కానీ అసలు రహస్యం ... పూతన పూర్వ జన్మలో బలి చక్రవర్తి కుమార్తె. పేరు రత్నమాల. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నపుడు దానం కోరుతూ అక్కడకు వచ్చిన బాల వటువు వామనుడి ని చూసి, ఈ బాలుడెవ్వరు ... ఇంతటి తేజస్సుతో వెలిగిపోతూ ఇంత సుకుమారంగా వున్నాడు. నాకు కుమారుడిగా పుట్టివుంటే ఒడిలో కూర్చొండబెట్టుకుని ముద్దులాడుతూ పాలు త్రాగించేదాన్ని కదా అని ఆలోచిస్తూ ,
  వామనుడిలా వచ్చిన పరమాత్మ పట్ల మాతృభావాన్ని నింపుకుని ఉండిపోయింది .
అందరి హృదయాల్లో తిష్ట వేసుకునే కిట్టయ్యకు ఆ రత్నమాల భావన తెలిసిపోయింది. తన పట్ల మాతృభావపు స్నేహాన్ని ప్రకటించిన రత్నమాల కోరిక తీర్చటానికి ఆమెకు పూతనగా జన్మనిచ్చి ఆమె ఒడిలో చేరి పూతన చేత హృదయపూర్వకంగా  ప్రశంసించబడుతూ , ముద్దు చేయబడుతూ ,  విషపు పాలు అయినప్పటికీ మాతృభావనతో ఇచ్చిన పూతన పాలు త్రాగి ఆమె ముచ్చట తీర్చి తరువాత మోక్షమిచ్చాడు .
ఇలాంటి ఎన్నో దివ్యలీలల విలాస హాసమే శ్రీకృష్ణ కథ 

Tuesday, August 5, 2025

ఆర్యా ద్విశతి -గణపతి ధ్యానం

వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్ఠమ్/
కుంకుమ పరాగశోణంకువలయినీజారకోరకాపీడమ్//
మన రోజువారీ దినచర్య మొదలుపెట్టేముందుగణపతిని ధ్యానించి పనులు మొదలుపెట్టుకుంటేఎదురయ్యే ఆటంకాలు తొలగించుకునే మార్గాన్ని ఆయనే నిర్ధేశిస్తారు  అందుకే దూర్వాస మహర్షి సైతం కావ్యరచన ఆరంభానికి ముందు హేరంబుడి ధ్యానం చేసారు ఆయనేముంది త్రిపురాసుర సంహార సమయంలో ఊహించని ఆటంకాలతో ఆలోచనలో పడ్డ పరమశివుడు సైతం అమ్మవారి ప్రేరణతో జరిగిన పొరపాటు తెలుసుకుని గణపతి ధ్యానం చేసి కార్యం సాధించారు ఆ సమయంలో గణపతి తన యొక్క తత్వాన్ని వేయి నామాలలో శివునకు ఉపదేశించారుఅందులో పేర్కొన్న ఈ నామాలను తెలుసుకుంటేనవగ్రహాలు కూడా గణపతి అంశలే అని తేటతెల్లమవుతుంది...
ఆ నామాలు రాహు మందః(శని) కవి(శుక్ర) జీవః(గురు) బుధ భౌమ(కుజ) శశి రవి
గణపతి ధ్యానం...నవగ్రహధ్యానమే గ్రహదోషాలతో ఇబ్బంది పడేవారు 
శ్రీగణేశాయ నమః రాహు మంధః కవి జీవో బుధ భౌమః శశి రవిః శ్రీగణేశాయనమః
 అని నిత్యం మననం చేసుకుని ఉపశమనం పొందవచ్చు గణపతి అంటే చవితి రోజు చదువుకునే పసుపుముద్ద గణపతి మాత్రమే కాదు . ఆయన అనాది అమ్మ వారు ఎప్పటి నుండి వున్నారో అప్పటినుండి మహాగణపతి వున్నారు . ఆయన ప్రాదుర్భవించిన విశేషాన్ని లలితా సహస్రంలో అద్భుతంగా వర్ణిస్తారు 
అమ్మవారి నామం... కామేశ్వరముఖాలోకకల్పిత శ్రీగణేశ్వరా ..దీని అర్థం .. అమ్మ వారు చిరునవ్వుతో కామేశ్వరుడి వైపు చూస్తే అందుకు ప్రతిస్పందనగా కామేశ్వరుడు కూడా చిరునవ్వుతో అమ్మ కామేశి ని చూడగా ఒకదానితో నొకటి చేరువైన వారిరువురి చిరునగవుల కాంతి పుంజం ఓంకార రూపంలో కనబడి అది  గజముఖుడైన గణపతి గా రూపు దాల్చింది  రాగానే ఏమి చేసాడాయన .... భండాసురుడి ప్రధాన అనుచరుడు ప్రయోగించిన విఘ్నయంత్రం దేవి యొక్క సేన అంతటిని నిస్తేజపరిచి వారు యుద్ధం చేయటానికి విముఖులయ్యేటట్లు చేస్తే ఆ విఘ్నయంత్రాన్ని బ్రద్దలు చేసి దేవీ సేన యొక్క నిస్తేజాన్ని తొలగించి యుద్ధోన్ముఖులను చేశారు అంటే మన విఘ్నాలను తొలగించుటలో అయన ఎంతటి ఘటికుడో  ఈ ఘటన తెలియజేస్తుంది (అమ్మవారి తదుపరి నామం :మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితా ) అట్టి ఆ మహా గణపతి ని ధ్యానిస్తూ దుర్వాస మహర్షి చేసిన ధ్యాన శ్లోకం ఇది . నిత్య పఠనీయం  
దాని భావం : ఎడమ తొడపై కూర్చుని కుడి చేతిని వీపు భాగంనుండి వేసి గణపతిని ఆలింగనం చేసుకునివున్న వల్లభా దేవి (సిద్ద లక్ష్మీ స్వరూపం) తో ఉన్నట్టివాడు  కుంకుమ వలే ఎరుపు వర్ణంతో ప్రకాశించువాడు కలువలకు ప్రియుడైన మొలక చంద్రుని (తదియ నాటి చంద్రుని రూపం)  సిగలో దాల్చినవాడు అగు గజ వదనునికి నమస్కారం

  రూపాన్ని ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని మననం చేస్తే సర్వ శుభాలు కలుగుతాయి అట్టి మహాగణపతి పాద పద్మములకు ప్రణమిల్లుతూ