Saturday, December 28, 2024
Friday, December 27, 2024
నవ రూప గురువాయూరప్ప
సృష్ట్యాదివి నీవు సృష్టి అంతము నీవు ఆది అంతముల
నడుమ సాగు జీవన యానపు మూల కారణమగు కర్మ
రూపుడవు నీవు కర్మ ఫలముల దోషము పరిహరించి
ఆరోగ్య మీయవే లక్ష్మీకిరణ్ ప్రియభాంధవా
సాంద్రానందము
సర్వనిలయుడా సర్వేశ్వరుడు
పద్మ వనంబయ్యె
పద్మ సరోవర తీరాన కిశోరీ కిశోరులై
విహరించు వేళ పరవశించిన పుడమి
గర్భాన అరుణకాంతులతో విప్పారే
పద్మ సమూహం బొకటి పద్మాక్షి పద్మాక్షులు
వికసిత పద్మ వదనులై చూచుచుండ
కాంచిన మా మది పద్మ వనంబయ్యె
ఓ పద్మనాభ ప్రియా అడుగిడవమ్మా
ఆదరమున పద్మ నయనంబుల వాని తోడుగా
Wednesday, December 25, 2024
॥ ముకుందమాలా స్తోత్రం ॥
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితమ్ ।
సమాహితానాం సతతాభయప్రదం
తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీమ్ ॥ ౩౮ ॥
హృదయ మధ్యమున పద్మపత్రంలో
అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు
సదా ధ్యానించు వారలకు సకల భయాలు
తొలగి విష్ణుపదం సన్నిహితమవుతు
యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రౌ ద్విజన్మపదపద్మశరావభూతామ్ ।
తేనాంబుజాక్షచరణాంబుజషట్పదేన
రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ ॥ ౪౦ ॥
నా మిత్రులు జ్ఞాన మూర్తులు
కవిత్వ సామ్రాజ్యంలో రారాజులు
ద్విజోత్తములు (ద్విజన్మవరుడు , పద్మ శరుడు) .
నేను కులశేఖర చక్రవర్తి ని
ఈ పద్య కుసుమాలు పద్మాక్షుని
చరణాంబుజములకు
భక్తి ప్రపత్తులతో సమర్పితం
కుంభేపునర్వసౌజాతం కేరళే చోళపట్టణే ।
కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరమాశ్రయే ॥
కేరళ లోని చోళ పురాధీశుడిగా జన్మించిన కుల శేఖరుని
భక్తితో ఆశ్రయిస్తున్నాను
ఇతి ముకుందమాలా సంపూర్ణా ॥
రంగనాథ సేవలో జీవితాన్ని తరింపచేసుకున్నారు ఆయన
భక్తికి మెచ్చిన శ్రీ వేంకటేశ్వరుని తన పాదాల చెంత గడపలా
పడి వుండి ఎల్లప్పుడూ తనను చూసుకునే భాగ్యం ప్రసాదించమని
వరం కోరి తిరుమలలో గర్భగుడిలో వెంకట నాథుని ముందున్న గడప
(దీనినే కులశేఖరపడి గా పిలుస్తారు)గా జీవితం సార్థకం చేసుకున్న
మహనీయుడు . అప్పటినుండే దేవాలయ ప్రవేశం చేసేటపుడు
గడపాలకు నమస్కరించే సంప్రదాయం మొదలయ్యింది . ఏ మహా భక్తుడు
Tuesday, December 24, 2024
ఎవరివో నీ వెవరివో
ముకుందమాలా స్తోత్రం-12
విష్ణో కృపాం పరమకారుణికః ఖిల త్వమ్ ।
సంసారసాగరనిమగ్నమనంత దీన-
ముద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోఽసి ॥ ౩౪ ॥
ఓ హరీ ! ఓ పురుషోత్తమా ! ఓ విష్ణు
నీవు దయా సముద్రుడవు
పాపులకు మరల మరల ఈ భవసాగరమే
గతి అగుచున్నది
నీ దయావర్షం నాపై కురిపించి
నన్ను ఉద్దరించు ముకుందా
క్షీరసాగరతరంగశీకరా –
సారతారకితచారుమూర్తయే ।
భోగిభోగశయనీయశాయినే
మాధవాయ మధువిద్విషే నమః ॥ ౩౯ ॥
పాల కడలిలో అలల తుంపరలు దేహాన్ని తాకుతూ
నీలాకాశాన తారకలు వలె మెరుయుచుండగా
శేషతల్పం మీద సుఖాసీనుడవైన మా
మధుసంహారీ నీకివే నా మనఃపూర్వక ప్రణామములు