Friday, October 4, 2024

దేవీ నారాయణీయం దశకం -2

1. అసురుల యుద్ధంలో ఓడించి సంబరాలలో మునిగిన దేవతలు విజయ చిహ్నంగా యజ్ఞం చేయదలచి పరమ శివుని బ్రహ్మను తోడుగా చేసుకొని యజ్ఞ పురుషుడు  అడ్డులేని శౌర్యం కల విష్ణువు చెంతకు బయలుదేరిరి  2  బలమైన పదునైన వింటి నారి తో బిగించబడిన విల్లు పై తన చుబుకం నుంచి నిద్రావశుడై వున్న  విష్ణువు ను ఆశ్చర్యంతో చూస్తూ వుండిపోయిరి మంచి నిద్రలో వున్నవారిని నిదురలేపుట పాపమని తలచి మౌనంగా చేస్తూ వుండిపోయిరి  3 బ్రహ్మ మాయచే కల్పింపబడిన తెల్ల చీమల కొండ వలన కలిగిన చిరాకుతో  విష్ణువు తన చుబుకాన్ని వింటినారి కి  బలంగా నొక్కటం చేత  తెగిన వింటినారి వంపుగా వున్నా వింటి ని ఒక్క ఒడుపున నిటారుగా చేయటం చేత   ఆ విల్లు వేగంగా విష్ణువు యొక్క కంఠాన్ని తాకటం చేత ఆయన శిరస్సు తెగిపడింది  4.  దేవతలందరు చూచుచుండఁగా  ముర అను రాక్షసుని సంహరించిన మురారి శిరస్సు ఎగిరి వెళ్లి సముద్రమునందు పడినది. విషణ్ణ వదనంతో  నిశ్చేష్టితులై హాహా కారాలు చేస్తూ దేవతలు విచారంలో మునిగిపోయారు  5 విష్ణువు యొక్క తల పడటం చూసి ఇది ఎలా జరిగింది  ఎవరు చేశారు అని తమలో తాము చర్చించుకుంటున్న దేవతలతో బ్రహ్మ కారణం లేకుండా ఎట్టి కార్యము జరుగదు . విధి ఎంతో బలీయమైనది కదా అని పలికెను  6  కరుణార్ధ్ర చిత్తము కలిగి  బ్రహ్మాండ సృష్టి అంతకు కారణభూతురాలైన దేవిని ధ్యానించండి .  సర్వగుణములు కలిగినట్టిది ఏ గుణములు అంటనట్టిది సర్వ కార్యములు నిర్వర్తించుటలో సర్వ సమర్థురాలగు ఆ తల్లి అవసరమైన కార్యాన్ని నిర్వర్తిస్తుంది అని బ్రహ్మ పలికెను  7 ఈ విధంగా బ్రహ్మ చే ప్రోత్సహించబడిన దేవతలు వేదములు దేవి ని స్తుతించిరి సంతోషం పొందిన దేవి ఆకాశమున నిలిచి దేవా సమూహమును చూస్తూ ఈ విధంగా పలికెను... ఈ విధంగా పడివున్న హరి వలన మీకు సర్వ శుభములు కలుగును  8  హయగ్రీవుడను బలవంతుడగు రాక్షసుడు నానుండి వరములు పొందినవాడై భయము వీడి వేదములను మునులను పీడించుచున్నాడు . నామ రూపములలో తనను పోలిన  (గుఱ్ఱము శిరసు కలిగి హయగ్రీవుడను పేరు కల ) వాడి చేతిలోనేమరణం పొందుదునన్న వరం కోరెను  9  విధి వశాత్తు విష్ణువు యొక్క శిరము తెగిపడినది . తలలేని హరి శరీరమునకు గుఱ్ఱపు శిరస్సు అతికించినచో మురారి హయగ్రీవ నామధేయుడై హయగ్రీవుడను అసురుడిని వేగంగా సంహరింపగలడు  10 ఈ విధంగా తెలిపి దేవి అదృశ్యరాలాయెను . వెంటనే త్వష్ట గుర్రపు శిరస్సును మురారి దేహమునకు అనుసంధించెను . దేవతలందరు ఉల్లాసముతో చూస్తుండగా హయాననుడగు శ్రీహరి ప్రాదుర్భవించెను  11 ఓ దేవి నీయొక్క ఆశీస్సులతో హయ వదనుడైన మురారి రణమునందు  హయగ్రీవుడను రాక్షసుని సంహరించెను . జగత్తునకు సర్వ మంగళములు కలిగించు ఓ దేవి ఎల్లప్పుడూ నా శిరముపై నీ దయా వర్షం కురిపించు 

No comments: