ఆర్యా ద్విశతీ ఇదొక సర్వోత్కృష్ఠమైన కావ్యం
దీనిని భావన చేయగలిగితే వారి శరీరమే మణిద్వీపం అవుతుంది హృదయం చింతామణి
గృహమవుతుంది వారిలోని చైతన్యమే పరదేవత అవుతుంది
తలచిన మాత్రం చేతనే మనలను పునీతులను చేయు అత్రీ అనసూయ దంపతుల పుత్రుడు రుద్రాంశ సంభూతుడు క్రోథమే అలంకారంగా గల
మహర్షీ అగు దూర్వాసుడు తాను దర్శించిన అమ్మ లోకాన్ని అందులోని వివిధ దేవతా శక్తులను వారు నివసించే ప్రదేశ విశేషాలను అద్బుతంగా వివరించిన గ్రంధరాజమే ఆర్యా ద్విశతి
ఆర్యా ద్విశతి భావన చేసిన వారికి అంబ సాక్షాత్కరించునని నడిచే దైవంగా ప్రసిద్ధి చెందిన కంచి కామాక్షీ అవతారమే అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వాక్కు
అట్టి ఆర్యా ద్విశతిని భావనాత్మకంగా వివరించటం ద్వార నా మనసులో ఆ మణిద్వీపాన్ని చెరగని విధంగా చిత్రించుకుని తరించే చిరుప్రయత్నమిది
వందసార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాసిన ఫలమెక్కువ కదా
ఈ విధంగా అమ్మ యెక్క లోకపు ధ్యానం నిరంతరం చెసే ప్రయత్నం