Friday, February 19, 2010

సద్గురు


                                    మహా గణపతయే నమః

 

సద్గురు సాయి లీలలను ప్రత్యక్షంగా చవిచూసిన ఒక భక్తుని అనుభవాల సంపుటికి ఆ భక్తుని కుమారుడు ఆంగ్లంలో అక్షరబద్ధం చేయగా  వాటిని  చదివి 

సంబ్రమాశ్చర్యాలకు  లోని  తెనుగించ  సంకల్పించి  చేసిన  చిన్ని  ప్రయత్నమిది  

 

ముంబై  నుండి బయలుదేరిన మన్మాడు రైలు నాసిక్ రోడ్ స్టేషన్ దాటి పరుగులుపెడుతుంది .  ఉన్నత శ్రేణికి చెందిన బోగీలో  కొందరు  పెద్ద  మనుషులు పేకాటతో  కాలక్షేపం  చేస్తున్నారు .

 ఇంతలో  తెల్లని వస్త్రాన్ని తలకు చుట్టుకున్న ఫకీరు ఒకడు వారిలో ఒక పెద్దమనిషి ముందు భిక్ష కోసం చేయి చాచాడు .
 అతని పరిస్థితికి జాలి  పడిన ఆ పెద్ద మనిషి ఖరీదైన తన కోటు జేబులోకి చేయి పోనిచ్చి వెండి రూపాయి తీసి అతనికి  ఇచ్చి ప్రక్కకు తొలగమని ఆటకు అడ్డురావద్దని  చెప్పాడు

 ఆ నాణెం  తీసుకున్న ఫకీరు దానిని పరికించి చూడసాగాడు . ఎందుకంటే 1908 కాలం  నాటి  విషయం  కదా . ఆ రోజుల్లో  రూపాయి అంటే చాలా  పెద్ద  మొత్తం

అది గమనించిన ఆ  పెద్ద మనిషి  నీవేమి  సందేహించనవసరం  లేదు . అది   స్వచ్చమైన  వెండితో  చేయబడిన జార్జ్  5 చిహ్నం కలిగి ,1905 వ  సంవత్సరంలో   చేయబడినది , ఇక  ప్రక్కకు తప్పుకో  అని  గట్టిగా చెప్పాడు . ఆ  ఫకీరు అక్కడనుండి   ప్రక్కకు  వెళ్ళిపోయాడు

మరునాడు  వేకువ ఝాముకు షిర్డీ చేరుకున్నారు . ఆ ప్రాంతాన్ని బాగుగా తెలిసియున్న  అతని  కుమారుడు , భార్య  సూచనలను  పాటిస్తూ ఆ పెద్దమనిషి స్నానాదికాలు పూర్తి చేసి   పూజా సామాగ్రితో ద్వారకామాయి  లోకి  అడుగుపెట్టారు.

ఆ పెద్దమనిషి , అతని భార్య బాబా ను చూసి ఆయన పాదాలకు నమస్కరించారు . అప్పుడు   బాబా అతనితో  " ఓ  పెద్దాయనా ! మా  అమ్మ , సోదరుడు ఎంతో  నచ్చ  చెప్పినమీదట   కాని , ఇక్కడకు  రావటానికి  నీవిష్టపడలేదు నన్ను గుర్తుపట్టావా " అని  అడిగారు.

 లేదు  అన్నది అతని సమాధానం.

 పోనీ దీనిని గుర్తించావా తాను ధరించిన కఫ్నీ జేబు లోనుండి జార్జ్ 5 బొమ్మ ముద్రించిన   వెండి రూపాయి తీసి చూపిస్తూ అడిగారు బాబా .

 తెల్లబోవటమే సమాధానమయ్యింది . రాత్రి  రైలులో జరిగిన ఘటన గుర్తుకు రాసాగింది.

 రాత్రి నీదగ్గరకు వచ్చిన ఫకీరు నేనే  సందేహనివృత్తి  చేసారు బాబా  

 ఒక్కసారిగా దిగ్బ్రమకు లోనయ్యారు . వెంటనే  తేరుకుని రాత్రి తన ప్రవర్తనకు  క్షమాపణ   కోరి, బాబా పాదాలకు నమస్కరించారు .  బాబా గురించి తన భార్య కుమారుడు  చెప్పిన   మాటల్లో ఎంతమాత్రము అసత్యం  లేదు . వీరు నిజంగా దేవుని యొక్క దూత  అని  మనసులో  తలంచసాగారు  
 ఆ  పెద్దమనిషిలో పరివర్తన జరిగిపోయింది . ప్రార్ధనా సమాజం నుండి విడివడి బాబా యొక్క  సేవకు తన జీవితం అంకితం చేసారు. ప్రతి  ముఖ్యమైన పని బాబాను సంప్రదించిన   తరువాతే మొదలు పెట్టేవారు . బాబా పట్ల అమితమైన ప్రేమభావం పెంచుకున్నారు అంతేకాక బాబాకు నూలు వస్త్రం  పంపిస్తుండేవారు . దానితో బాబా కఫ్ని   కుట్టించుకునేవారు.  పెట్రోమాక్స్ దీపాన్నికూడా ఇచ్చారు . సాయంత్రపు    వేళ ద్వారకామాయిలో దానిని  ఉపయోగించేవారు . షిర్డీ లో  ఉన్నప్పుడు ఆ దీపం    తానే వెలిగించి  నిర్దిష్టమైన  ప్రాంతంలో ఉంచేవారు

భగవంతుడు సర్వవ్యాపి . ఆయన ఎప్పుడైనా ఎ  రూపంలోనైన సంచరించగలరు

ఇందుకు తార్కాణాలు అనేకం . దత్తాత్రేయులు వారు కూడా అనేక రూపాలు ధరించి  భక్తుల   వద్ద భిక్ష స్వీకరిస్తుంటారు ఇప్పటికి కూడా . ఆయన ఎప్పుడైనా  ఎ  రూపంలోనైన  రావచ్చు . కొన్నిసార్లు  కుష్టువ్యాధి గ్రస్తుని వలె వచ్చి భక్తులను పరీక్షించేవారు . అందుకే  భిక్ష  కోరి   వచ్చిన వారిని  భగవత్ స్వరుపులుగా  ఆదరించవలె  .



--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


No comments: